దుబాయ్ లో భారతీయ బిలియనీర్ కు దేశ బహిష్కరణ... కారణం ఇదే!
దుబాయ్ లో ఇండియన్ బిలియనీర్ బల్విందర్ సింగ్ సాహ్నీకి అక్కడ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
By: Tupaki Desk | 6 May 2025 5:05 AMయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రముఖ వ్యాపారవేత్తగా పేరొందిన ఇండియన్ బిలియనీర్ బల్విందర్ సింగ్ సాహ్నీ కటకటాలపాలయ్యారు. మనీలాండరింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో దోషిగా తేలడంతో కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో.. రూ.కోటి జరిమానాతో పాటు ఆస్తుల స్వాధీనానికి కోర్టు ఆదేశించింది.
అవును... దుబాయ్ లో ఇండియన్ బిలియనీర్ బల్విందర్ సింగ్ సాహ్నీకి అక్కడ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో జైలు శిక్ష పూర్తైన తర్వాత దేశం నుంచి బహిష్కరించాలని తీర్పు వెలువరించింది. షెల్ కంపెనీలు, ఫోర్జరీ ఇన్ వాయిస్ లతో 150 మిలియన్ దిర్హమ్ లు (సుమారు రూ.340 కోట్లు) మనీలండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఆ.ఎస్.జీ. ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ వ్యస్థాపకుడు అయిన సాహ్నీ.. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు అభియోగాలు వచ్చాయి. ఈ క్రమంలో అతనితో పాటు మరికొందరిపైనా కేసు నమోదైంది. దీనిపై విచారన జరిపిన కోర్టు.. ఆర్థిక మోసాల ఆరోపణల్లో నిజమున్నట్లు తేల్చింది. ఈ నేపథ్యంలో తాజాగా తీర్పు వెలువరించింది.
ఇందులో భాగంగా... బల్విందర్ కు ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. భారతీయ కరెన్సీలో సుమారు రూ.1.14 కోట్లు జరిమానా విధించింది. ఇదే సమయంలో 150 మిలియన్ దిర్హమ్ లు (సుమారు రూ.340 కోట్లు) విలువైన ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. శిక్ష పూర్తైన అనంతరం దేశం నుంచి పంపించేయాలని స్పష్టం చేసింది.
కాగా రాజ్ సాహ్నీ గ్రూప్ (ఆర్.ఎస్.జీ) పేరుతో ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీని స్థాపించారు బల్విందర్. ఈయనకు దుబాయ్ స్పోర్ట్స్ సిటీలో ఖరీదైన ఇళ్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, ఫైవ్ స్టార్ హోటల్ వంటి పలు ఆస్తులు ఉన్నాయి. ఈయన కంపెనీ దుబాయ్ తో పాటు భారత్, అమెరికా సహా పలు దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.