Begin typing your search above and press return to search.

ఏపీకి మోడీ గ్యారెంటీ: చంద్ర‌బాబు

ఏపీకి ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ్యారెంటీ ల‌భించింద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు.

By:  Tupaki Desk   |   7 May 2024 3:46 AM GMT
ఏపీకి మోడీ గ్యారెంటీ:  చంద్ర‌బాబు
X

ఏపీకి ఇప్పుడు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ్యారెంటీ ల‌భించింద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. తాజాగా అన‌కాప‌ల్లిలో నిర్వ హించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌భ అనంత‌రం.. అంటే..మోడీ వెళ్లిపోయిన త‌ర్వాత‌.. చంద్ర‌బాబు ఇక్క‌డ‌కు వ‌చ్చారు. ఇంత‌కు ముందు బిజీ షెడ్యూల్ కార‌ణంగా చంద్ర‌బాబు వేరే కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. ``ఏపీకి ఇప్పుడు మోడీ గ్యారెంటీ కూడా ల‌భించింది. ఇక‌, ఏపీ అభివృద్ధిని ఏశ‌క్తీ అడ్డు కోలేదు. ఏపీలో సువ‌ర్ణాధ్యాయం ప్రారంభం కానుంది. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని మోడీనే చెప్పారు`` అని సంతోషంగా వ్యాఖ్యానించారు.

ప్ర‌ధాని గ్యారెంటీ కోస‌మే.. తాను కూడా ఎదురు చూశాన‌ని చంద్ర‌బాబు అన్నారు. అది ఇప్పుడు సాకారం అయింద‌న్నారు. ప్ర‌జ‌లు ఇక‌, వెనుదిరిగి చూసుకునే అవ‌కాశం లేద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రి జీవితంలోనూ వెలుగు నింపేందుకు మోడీ ప్ర‌య‌త్నిస్తు న్నార‌ని అన్నారు. గ‌త ఐదేళ్ల‌లో కూడా మోడీ ఏపీకి ఎంతో ఇచ్చార‌ని.. కానీ, ఈ సైకో(జ‌గ‌న్‌) ముఠా ఆబ‌గా భోంచేసింద‌న్నారు. ఇప్ప‌టికి మ‌రోసారి ఏపీ ప్ర‌జ‌ల‌కు సువ‌ర్ణ అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు. వ‌చ్చే 13న రెండు ఓట్ల‌లో ఒక‌టి మోడీకి, రెండోది కూట‌మి పార్టీల‌కు వేయాల‌ని పిలుపునిచ్చారు. త‌ద్వారా.. ఏపీని అభివృద్ధి చేసుకునేందుకు ప్ర‌తి ఒక్క‌రూ న‌డుం బిగించాల‌న్నారు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై వైసీపీ నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం చేసిన‌ వ్యాఖ్య‌ల‌పై చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ``వ‌య‌సులో పెద్ద‌.. కానీ.. బుద్ధి లేదు. ప‌వ‌న్ ను ప‌ట్టుకుని అన‌రాని మాట‌లు అన్నారు. అంటున్నారు. ప‌వ‌న్‌కు ఏం త‌క్కువ‌ని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. సినీ ఫీల్డ్‌లో ప‌వ‌న్‌కు ఎదురు లేదు. అక్క‌డ తిరుగులేని గౌర‌వం ఉంది. అయినా.. అవ‌న్నీ వ‌దులుకుని.. సైకో పాల‌న‌నుంచి రాష్ట్రానికి విముక్తి క‌లిగించాల‌నే ల‌క్ష్యంతో ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తే.. ఆయ‌న‌ను కూడా ఇక్క‌డి వారు విమ‌ర్శిస్తున్నారు. రేపు ప‌వ‌న్ లాంటి వారు కూడా రాక‌పోతే.. ఈ సైకో పాల‌న కొన‌సాగితే.. రాష్ట్రం ఏమ‌వుతుందో అంద‌రూ ఆలోచించుకోవాలి`` అని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.