Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్న తెలంగాణ బీజేపీ ఎంపీ!

అస్సలు ఊహించలేని వ్యాఖ్య ఒకటి తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్లలో ఒకరైన ధర్మపురి అర్వింద్ నోటి నుంచి రావటం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 6:01 AM GMT
బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్న తెలంగాణ బీజేపీ ఎంపీ!
X

అస్సలు ఊహించలేని వ్యాఖ్య ఒకటి తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్లలో ఒకరైన ధర్మపురి అర్వింద్ నోటి నుంచి రావటం సంచలనంగా మారింది. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ కు బీ టీంగా బీజేపీ అన్న మాట బలంగా వినిపిస్తున్న వేళ.. ఎంపీ ఆర్వింద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి ఆర్వింద్ ఉద్దేశం వేరే అయినా.. ఆయన మాటల్ని చూసినంతనే మాత్రం అందుకు భిన్నమైన అర్థం వచ్చేలా ఉండటం ఆసక్తికరంగా మారింది.

పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ.. నేతల మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది. ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా విరుచుకుపడుతున్నారు. ఇలాంటి వేళ.. తమ ప్రత్యర్థి పార్టీకి మేలు కలిగించేలా వ్యాఖ్యలు చేయటం షాకింగ్ గా మారింది. అందులోని అలాంటి సంచలన వ్యాఖ్యలు చేసింది బీజేపీ ఫైర్ బ్రాండ్ అర్వింద్ కావటం మరింత ఆసక్తికరంగా మారింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే ముఖ్యమంత్రిగా కేసీఆర్ బెటర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

జగిత్యాల జిల్లాలోని ఇబ్రహీం పట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. "రేవంత్ కంటే కేసీఆర్ మేలు. ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లు తెలంగాణ కోసం పోరాడారు. కేసీఆర్ కోట్లాడేటప్పుడు రేవంత్ తెలుగుదేశంలో ఉన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పని చేశారు. ఇప్పుడు చంద్రబాబు చెప్పినట్లు చేస్తున్నాడు. చంద్రబాబుకు సంబంధించిన నాయకులంతా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు" అంటూ కొత్త వాదనకు తెర తీశారు.

వాస్తవంగా చూస్తే.. టీడీపీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున అధికార బీఆర్ఎస్ లో ఉండటం తెలిసిందే. అర్వింద్ తాజా వ్యాఖ్యల్ని చూస్తే.. కాంగ్రెస్ ను.. రేవంత్ ను లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఈసారి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చింది పెద్దగా లేదు. ఒకవేళ తీసుకొచ్చినా.. చంద్రబాబు అరెస్టు విషయాన్నే తప్పించి.. మిగిలిన అంశాల్ని పెద్దగా ప్రస్తావిస్తున్నది లేదు.

అయితే.. అర్వింద్ మాత్రం చంద్రబాబును టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. "2018 ఎన్నికల్లో హైదరాబాద్ నేనే కట్టానని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? కాంగ్రెస్ కు ఓటు వేశారో తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో ఉన్న తెలుగుదేశం చేతిలో పెట్టినట్లే" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను రేవంత్ హోల్ సేల్ గా అమ్మేస్తాడన్న అర్వింద్.. చంద్రబాబు సంచులను రేవంత్ మోసుకెళ్లాడని వ్యాఖ్యానించారు.