Begin typing your search above and press return to search.

వైసీపీ హెలికాప్టర్ పోస్టుకు టీడీపీ స్ట్రాంగ్ రిప్లై!

సీఎం చంద్రబాబుతో పాటు మరికొంతమంది వీపైపీలు వాడుతున్న హెలికాప్టర్ ఫిట్ నెస్ విషయంలో ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   16 May 2025 5:31 AM
వైసీపీ హెలికాప్టర్  పోస్టుకు టీడీపీ స్ట్రాంగ్  రిప్లై!
X

సీఎం చంద్రబాబుతో పాటు మరికొంతమంది వీపైపీలు వాడుతున్న హెలికాప్టర్ ఫిట్ నెస్ విషయంలో ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.. వాటి ఫిట్ నెస్ గురించి, అవసరమైతే వాటిని మార్చాల్సిన విషయం గురించి నివేదిక కోరుతూ ఓ కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ పై వైసీపీ ఎక్స్ వేదీకగా స్పందించింది.. దానికి టీడీపీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

అవును... ఏపీ ప్రభుత్వం కొత్త హెలికాప్టర్ కొనుగోలు విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఎక్స్ వేదికగా స్పందించిన వైసీపీ... "జనం సొమ్ముతో బాబు కొడుకులు జల్సాలు చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.. అప్పులు పుట్టడం లేదన్న చంద్రబాబు.. రూ.172 కోట్లతో విలాసవంతమైన హెలికాప్టర్ కొనుగోలు చేస్తున్నారు. దీన్ని వారి విలాసాల కోసం వాడతారు." అని ట్వీట్ చేసింది.

దీంతో... వైసీపీ ట్వీట్ ను ఫేక్ అని కొట్టిపడేసిన టీడీపీ.. అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఘాటు రిప్లై ఇచ్చింది. ఇందులో భాగంగా... "రూ.172 కోట్ల ప్రజాధనంతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కోసం విలాసవంతమైన హెలికాఫ్టర్ ను ప్రభుత్వం కొంటున్నట్టు తన సోషల్ మీడియాలో ఫేక్ పోస్ట్ పెట్టిన జగన్ అనే ఫేక్ గురించి ఈ విషయాలు తెలుసా?" అని మొదలుపెట్టింది.

అనంతరం... తన విలాసాల కోసం బీచ్ వ్యూతో రుషికొండ ప్యాలెస్ కి రూ.500 కోట్లు.. తన పార్టీ అఫీసుల కోసం 26 జిల్లాల్లో 26 ప్యాలెస్ లకు రూ.900 కోట్లు.. 986 మంది సెక్యూరిటీకి రూ.1000 కోట్లు, సర్వే రాళ్లపై తన బొమ్మకి రూ.700 కోట్లు, పాస్ బుక్స్ పై తన ఫోటోలకు రూ.13 కోట్లు, తన ఇంటి చుట్టూ ఇనుప కంచె కోసం రూ.12.85 కోట్లు, ఎగ్ పఫ్ లకు రూ.3.6 కోట్లు తగలేశారని ఫైరయ్యింది!

ఇలా ఈ రేంజ్ లో దోపిడీ, జల్సాలు, ప్రపంచంలో ఏ నియంత కూడా చేసి ఉండరేమో అని అభిప్రాయపడింది. ఇదంతా లోకేష్ పై జరుగుతున్న ఫేక్ ప్రచారం అని టీడీపీ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో వైసీపీ హెలికాప్టర్ ప్రచారానికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.