Begin typing your search above and press return to search.

ఫేస్ బుక్ లవ్ స్టోరీ... కొత్త భర్త విషయంలో ట్విస్ట్ ఇచ్చిన అంజూ!

మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ కు చెందిన అంజూ అనే మహిళ.. ఫేస్‌ బుక్‌ లో పరిచయమైన ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 Dec 2023 10:52 AM GMT
ఫేస్  బుక్  లవ్  స్టోరీ... కొత్త భర్త విషయంలో ట్విస్ట్  ఇచ్చిన అంజూ!
X

మధ్యప్రదేశ్‌ లోని గ్వాలియర్‌ కు చెందిన అంజూ అనే మహిళ.. ఫేస్‌ బుక్‌ లో పరిచయమైన ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం అతడిని పెళ్లాడి.. అక్కడ విందులూ, వినోదాలతో ఆమె లైఫ్ హ్యాపీగానే ఉందని తెలుస్తుంది. అయితే అప్పటికే పెళ్లైన ఆమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన అంజూ... తాజాగా ఒక కీలక ట్విస్ట్ ఇచ్చింది.

అవును... ఫేస్‌ బుక్ లో పరిచయమైన ప్రియుడిని పెళ్లాడిన అంజూ ఇటీవల తన పిల్లలు గుర్తొచ్చారంటూ ఇండియాకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడిని ఢిల్లీలో కలిసిన అంజూ తన భవిష్యత్ జీవితంపై మాట్లాడింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఢిల్లీలో అద్దెకు ఉంటున్నానని, త్వరలో తాను ఇక్కడే కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లు తెలిపింది.

భిల్వారాకు చెందిన అంజూ పాక్ వెళ్లి నస్రుల్లాను వివాహం చేసుకొని తిరిగి ఢిల్లీకి వచ్చింది. తన పిల్లల కోసం పాకిస్థాన్ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చానని, తన పిల్లలిద్దరూ సంతోషంగా ఉన్నారని అంజూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఒక ట్విస్ట్ ఇచ్చింది. ఇందులో భాగంగా... తన కొత్త భర్త నస్రుల్లా త్వరలో భారత్‌ కు రాబోతున్నట్లు ఆమె వెల్లడించింది.

ఈ క్రమంలో... తన కొత్త భర్త నస్రుల్లా త్వరలో ఇండియా రావాలనుకుంటున్నాడని.. అతడు తనకు పాకిస్థాన్‌ ను చూపించాడని.. ఈ సమయంలో తాను కూడా అతడికి భారత్‌ ను చూపించాలనుకుంటున్నట్లు అంజూ తెలిపింది. ఈ క్రమంలో తన భర్త అరవింద్ కు విడాకులు ఇచ్చే విషయం ఆలోచిస్తానని చెప్పుకొచ్చింది.

ఇదే సమయంలో తాను త్వరలో భిల్వారాకు వెళ్లి తన పత్రాలన్నీ తీసుకొని వచ్చి తన పిల్లల కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలనుకున్నానని అంజూ చెప్పుకొచ్చింది. కాగా... ఇటీవల వాఘా సరిహద్దు మీదుగా ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత అంజూను.. పంజాబ్ పోలీసు గూఢచార బృందం, అమృత్‌ సర్‌ లోని ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. విచారణ అనంతరం ఢిల్లీ వెళ్లేందుకు ఆమెకు అనుమతి ఇచ్చారు.

కాగా పాకిస్థాన్ లోని ఖైబర్‌ పఖ్తుంక్వా ప్రావిన్స్‌ లోని అప్పర్‌ దిర్‌ జిల్లాకు చెందిన నస్రుల్లా (29)ను గత జులై 25న అంజు (34) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ లో పరిచయమైన ఇతడి కోసమే ఆమె భర్త, పిల్లలను వదిలి పాక్ కి వెళ్లిపోయింది. ఈ క్రమంలో నస్రుల్లాతో వివాహానికి ముందు ఆమె హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకున్నారని కథనాలొచ్చాయి!