Begin typing your search above and press return to search.

యాంకర్ శ్యామలకు బెదిరింపులు... వీడియో విడుదల!

ఆ బెదిరింపు కాల్స్ ని చూస్తుంటే తనకు భయంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాను మాత్రం వైసీపీలోనే కొనసాగుతానని, వైఎస్ జగన్ వెంటే ఉంటానని శ్యామల తేల్చి చెప్పారు.

By:  Tupaki Desk   |   7 Jun 2024 12:26 PM GMT
యాంకర్  శ్యామలకు బెదిరింపులు... వీడియో విడుదల!
X

ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ ఘోర పరాజయాన్ని చవి చూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యలో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా... రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులపై దాడులు మొదలైన పరిస్థితి. మాజీ మంత్రుల ఇళ్లపైనా దాడులు జరుగుతున్నాయి. ఈ సమయంలో యాంకర్ శ్యామల రియాక్ట్ అయ్యారు.

అవును.. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాగానే దాడులు మొదలైపోయాయి. వైసీపీ కార్యకర్తలను నడిరోడ్డుపై కత్తులతో దాడులు చేయడం, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులు చేయడం వరకూ పరిస్థితి మారిపోయింది! ఎన్డీయే కూటమిలో బీహార్, ఏపీ రాష్ట్రాల్లోని పార్టీలు కీలకంగా మారిన వేళ ఇలాంటి పరిణామాలు జరుగుతుండటంతో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో... యాంకర్ శ్యామల స్పందించారు. ఇందులో భాగంగా... తనకూ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని అన్నారు. ఆ బెదిరింపు కాల్స్ ని చూస్తుంటే తనకు భయంగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తాను మాత్రం వైసీపీలోనే కొనసాగుతానని, వైఎస్ జగన్ వెంటే ఉంటానని శ్యామల తేల్చి చెప్పారు.

ఇదే సమయంలో అందరికీ ఒకటే నచ్చాలని ఏమీ లేదని.. అలా అనుకోవడం చాలా అన్యాయమని అన్నారు. ఇదే సమయంలో తాను వైసీపీ తరుపున ప్రచారం చేస్తున్న క్రమంలో... ఎవరిమీదా వ్యక్తిగత విమర్శలు చేయలేదని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. వైసీపీ అభిమానిగా ఆ పార్టీని గెలిపించ్కునే ప్రయత్నంలో తాను ఎంత చేయాలో అంతేచేశానని అన్నారు.

ఇక.. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ - బీజేపీ - జనసేన కూటమికి శుభాకాంక్షలు తెలియజేసిన శ్యామల... ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల తీర్పును శిరసా వహిస్తామని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ గెలుపుకోసం కృషిచేసిన ప్రతీ ఒక్కరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. జగన్ మరింత బలాన్ని పుంజుకుని ఖచ్చితంగా అధికారంలోకి వస్తారని.. అందరం ఆయనవెంట నడుద్దామని విజ్ఞప్తి చేశారు!