Begin typing your search above and press return to search.

ఇదేం బరితెగింపురా నాయనా? పట్టపగలే ‘అనంత’లో అత్యాచార యత్నం

కొన్ని ఉదంతాలు చేసే చేటు అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంటాయి. తాజా ఉదంతం ఆ కోవకు చెందింది.

By:  Tupaki Desk   |   27 Jan 2024 7:49 AM GMT
ఇదేం బరితెగింపురా నాయనా? పట్టపగలే ‘అనంత’లో అత్యాచార యత్నం
X

కొన్ని ఉదంతాలు చేసే చేటు అంతా ఇంతా కాదన్నట్లుగా ఉంటాయి. తాజా ఉదంతం ఆ కోవకు చెందింది. అనంతపురం జిల్లాలోని బ్రహ్మసముద్రం మండలానికి చెందిన ఒక వివాహితపై పట్టపగలు.. సచివాలయ కన్వీనర్ చేసిన దాష్ఠీకం షాకింగ్ గా మారింది. దీనికి సంబంధించిన అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. పట్టపగలు.. ఒక వివాహిత మీద అత్యాచార యత్నానికి బరితెగింపు దేనికి సంకేతం? అని ప్రశ్నిస్తున్నారు.

దుస్తుల దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే మహిళ.. శుక్రవారం సాయంత్రం షాపు కట్టేసి.. చెరువు కట్ట మీదుగా ఊళ్లోకి వెళుతోంది. ఈ సమయంలో సచివాలయ కన్వీనర్ గా వ్యవహరించే పర్సన్ ఆమెను అడ్డుకున్నాడు. అతడి నుంచి తప్పించుకునే క్రమంలో ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. దీంతో.. తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ క్రమంలో ఆమె అరుపులతో అక్కడి పొలంలో పని చేసుకుంటున్న ఒక రైతు అక్కడకు చేరుకొని.. ఆమెను విడిపించే ప్రయత్నం చేశారు.

అతనిపైనా దాడికి పాల్పడ్డాడు. ఆమె జట్టుపట్టుకొని ఈడ్చి.. కాలితో తన్నుతూ లొంగదీసుకునే ప్రయత్నం చేవాడు. రైతుపై దాడి నేపథ్యంలో అక్కడికి గ్రామానికి చెందిన మరికొందరు చేరుకొని.. అతడ్ని తీవ్రంగా ప్రశ్నించటంతో అతను పరారయ్యాడు. బాధితురాలిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహితపై దాడికి పాల్పడిన ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. అతని పై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. తనకు రాజకీయ నేతలు సన్నిహితమంటూ గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతుంటాడని.. ఇలాంటి వ్యక్తిని నాయకులు.. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు దూరం పెట్టాల్సిన అవసరం ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.