Begin typing your search above and press return to search.

మంటలు రేపుతున్న మటన్

జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   21 April 2024 2:30 AM GMT
మంటలు రేపుతున్న మటన్
X

హైదరాబాద్ నగరంలో రేపు మాంసం దుకాణాదారులకు జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో చికెట్, మటన్, ఫిష్ అమ్మకాలను జీహెచ్ఎంసీ నిషేధించింది. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరోవైపు, హైదరాబాద్ మహా నగరంలో జైనుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నారని.. వారి కోసం ఆదివారం నాడు గ్రేటర్ వ్యాప్తంగా మాంసం షాపులు బంద్ చేయడం ఏంటని మాంసం ప్రియులు ప్రశ్నిస్తున్నారు.

అయితే, మహావీర్ జయంతిని జైనులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆ రోజున ఎలాంటి జీవ హింస చేయరు.. ఈ క్రమం లోనే మాంసాహారం బంద్‌కు పిలుపునిచ్చారు అన్నది ప్రభుత్వ వాదన.

జైనుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ మార్కెట్లతో పాటు మాంసం షాపులు కూడా బంద్ చేయాలని జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు అని పౌరులు ప్రశ్నిస్తున్నారు. వారి సాంప్రదాయాలకు తాము విరుద్దం కాదని, ప్రభుత్వం ఈ ప్రత్యేక పరిస్థితిని తీసుకు వచ్చిందని ఆరోపిస్తున్నారు.