Begin typing your search above and press return to search.

వైరల్ పిక్... అక్షతా మూర్తి సింపుల్ సిటీ పీక్స్ గురూ!

అవును... రద్దీగా ఉండే బెంగళూరులోని జయనగర్ నడిబొడ్డున.. కార్నర్ హౌస్ ఐస్ క్రీం లో అక్షతా మూర్తి తన తండ్రి నారాయణ మూర్తితో కలిసి కనిపించారు.

By:  Tupaki Desk   |   13 Feb 2024 7:21 AM GMT
వైరల్  పిక్...  అక్షతా మూర్తి సింపుల్  సిటీ పీక్స్  గురూ!
X

ఆమె భర్త ఒక దేశానికి ప్రధానమంత్రి, ఆమె తండ్రి పెద్ద ఐటీ కంపెనీకి వ్యవస్థాపకుడు.. ఇది ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ అనేది చెప్పేపనిలేదు! మినిమం పది కార్లు లేకుండా రోడ్లపైకి రాకూడదు.. కనీసం జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ లేకుండా తిరగకూడదు.. అసలు బయటే కనిపించకూడదు అనుకుంటారు కానీ... అక్షతామూర్తి సింప్లిసిటీ చూస్తే మాత్రం అలా అనలేరు! ప్రధాని భార్య అయినా కూడా సింపుల్ గానే ఉంటారామే!! ఈ క్రమంలో తాజాగా బెంగళూరులోని ఓ ఐస్ క్రీం షాపులో కనిపించారు.

అవును... రద్దీగా ఉండే బెంగళూరులోని జయనగర్ నడిబొడ్డున.. కార్నర్ హౌస్ ఐస్ క్రీం లో అక్షతా మూర్తి తన తండ్రి నారాయణ మూర్తితో కలిసి కనిపించారు. ఇద్దరూ పక్క పక్కన కూర్చుని ఐస్ క్రీం తింటున్నారు. ఇలా యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కుమార్తె అయిన అక్షతా మూర్తి ఇలా సింపుల్ గా కూర్చుని ఐస్ క్రీం తింటూ కనిపించారు.

ఇలా తండ్రీ కూతురూ సరదాగా గడిపిన క్షణాలకు సంబంధించిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. దీంతో ఆన్ లైన్ వేదికగా ఈ పిన్ పై చాలా కామెంట్లు వస్తున్నాయి. ఇందులో భాగంగా... ఈస్థాయి సింపుల్ సిటీ చాలా మందికి ఆల్ మోస్ట్ అసాధ్యం అని ఒకరంటే... విస్తారమైన సంపద ఉన్నప్పటికీ వారి స్థిరమైన స్వభావానికి ఇది నిదర్శనం అని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఈ ఫోటో షేర్ చేసిన నెటిజన్... "బ్రిటన్ ప్రథమ మహిళ అక్షతా మూర్తి తన తండ్రి నారాయణ మూర్తితో కలిసి బెంగళూరులోని జయనగర్ 5వ బ్లాక్‌ లోని కార్నర్ హౌస్‌ లో నిశ్శబ్దంగా వచ్చి ఐస్‌ క్రీం కొన్నారు. అత్యంత ధనవంతులే కానీ సాధారణ జీవితాన్ని గడుపుతారు. ఇది వారి గారి గొప్పతనం అని రాసుకొచ్చారు.

ఇదే సమయంలో... "ఒకే ఫోటోలు మూడు బెంగళూరు చిహ్నాలు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణ మూర్తి, గ్రేట్ బ్రిటన్ ప్రథమ మహిళ అక్షతా మూర్తి, బెంగళూరులోని అత్యుత్తమ ఐస్ క్రీం జాయింట్ కార్నర్ హౌస్!!" అని మరొక నెటిజన్ కామెంట్ చేశారు.