Begin typing your search above and press return to search.

భార్యకు ఏకే 47 గిప్టు.. ఫోటో పోస్టుతో చిక్కుల్లో పడ్డ నేత

ప్రేయసి పుట్టిన రోజుకు.. పెళ్లి తర్వాత వచ్చే తొలి పెళ్లిరోజు సందర్భంగా ఖరీదైన గిప్టులు ఇవ్వటం అలవాటే.

By:  Tupaki Desk   |   1 Sep 2023 4:47 AM GMT
భార్యకు ఏకే 47 గిప్టు.. ఫోటో పోస్టుతో చిక్కుల్లో పడ్డ నేత
X

ప్రేయసి పుట్టిన రోజుకు.. పెళ్లి తర్వాత వచ్చే తొలి పెళ్లిరోజు సందర్భంగా ఖరీదైన గిప్టులు ఇవ్వటం అలవాటే. అందరిలా చేస్తే తన ప్రత్యేకత ఏముందని అనుకున్నాడో ఏమో కానీ.. పశ్చిమబెంగాల్ కు చెందిన మాజీ టీఎంసీ నేత రైజల్ హాక్ చేసిన పని ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. అతడు చిక్కుల్లో పడేసింది. తన భార్యకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి సర్ ప్రైజ్ గిప్టు ప్లాన్ చేసిన అతను ఏకే 47ను ఇచ్చాడు. అది ఒరిజినలో.. బొమ్మో తెలీదు కానీ.. ఇచ్చిన గిప్టును ఫోటో తీయించి.. సగర్వంగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టుకున్నాడు.

మొదటి పెళ్లిరోజు బహుమతి అంటూ పెట్టుకున్న ఈ ఫోటోపై రాజకీయ వర్గాలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నాయి. మీరేమైనా తాలిబన్ల? అంటూ ప్రశ్నిస్తూ మండిపడుతున్నాయి. పెళ్లి రోజున భార్యకు అంత పెద్ద గన్ చేతికి ఇవ్వటం ఏమిటి? అంటూ వామపక్ష నేతలు మొదలు కొని బీజేపీ నేతల వరకు ఫైర్ అవుతున్నారు. దీనికి సోషల్ మీడియాలోనూ నెగిటివ్ కామెంట్లు భారీగా రావటంతో.. ఒత్తిడి తట్టుకోలేక సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోను డిలీట్ చేశాడు.

అయితే.. అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ ఫోటోలు వైరల్ గా మారటం.. సైన్యం.. పారామిలిటరీల్లో మాత్రమే వినియోగించే ఏకే 47 మీ చేతుల్లోకి ఎలా వచ్చింది? అంటూ కొత్త ప్రశ్నలు మొదలయ్యాయి. దీనిపై కేసు పెట్టాలని.. విచారణ జరపాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. దీంతో.. తాను చేసిన తప్పును గుర్తించిన సదరు నేత తన కారణంగా చెలరేగిన వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యారు.

ఇందులో భాగంగా తాను షేర్ చేసిన ఫోటో బొమ్మ ఏకే 47 తప్పించి.. అది నిజమైనది కాదని చెప్పే ప్రయత్నం చేసినా.. ఎవరూ దాన్ని పట్టించుకోవటం లేదు. డమ్మీ పిస్టల్ ను తానే సోషల్ మీడియాలో ఉంచానని.. అయితే.. ఈ ఫోటో వివాదంగా మారటంతో తాను డిలీట్ చేసినట్లుగా రైజల్ హాక్ ఎంత చెప్పినా.. అతడ్ని తిట్టి పోస్తున్న వారు తగ్గట్లేదు. ఇదిలా ఉండగా.. ఈ ఉదంతంపై వామపక్షాలు తీవ్రంగా స్పందిస్తూ..ఈ ఉదంతంపై విచారణ జరపాలని.. అది అసలు ఒరిజినలా? డమ్మీనా? లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరుతున్నారు. ఈ ఉదంతం హాట్ టాపిక్ గా మారింది.