Begin typing your search above and press return to search.

విమాన ప్రమాదంలో మృతులపై విదేశాంగ శాఖ కీలక ప్రకటన!

అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన ఘటనపై తీవ్ర ఆందోళనలు నెలకొంటున్నాయి.

By:  Tupaki Desk   |   12 Jun 2025 6:56 PM IST
విమాన ప్రమాదంలో మృతులపై  విదేశాంగ శాఖ కీలక ప్రకటన!
X

అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టెకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. దీంతో.. మృతుల సంఖ్యపై తీవ్ర ఆందోళన నెలకొందని అంటున్నారు.

ఈ 230 మంది ప్రయాణికుల్లోనూ 169 మంది భారతీయులు కాగా.. మిగిలినవారిలో 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 గురు పోర్చుగీస్ జాతీయులు, 1 కెనడియన్ జాతీయుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో దుర్ఘటనపై కేంద్ర విదేశాంగ శాఖ ప్రకటన చేసింది. ఇందులో భాగంగా.. ఈ ప్రమాదంలో చాలా మంది మరణించినట్లు వెల్లడించింది.

అవును... అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిన ఘటనపై తీవ్ర ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ సమయంలో స్పందించిన విదేశాంగ శాఖ.. అహ్మదాబాద్ లో చోటుచేసుకున్న ఘటన మాటలకు అందని పెను విషాదం అని.. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం చాలా మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారని, ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ఈ వివరాలు వెల్లడించారు.