Begin typing your search above and press return to search.

గోదావరిలో దూకిన మహిళ... బ్రిడ్జిపై ఎదురుచూస్తున్న శునకం!

By:  Tupaki Desk   |   18 July 2023 12:05 PM GMT
గోదావరిలో దూకిన మహిళ... బ్రిడ్జిపై ఎదురుచూస్తున్న శునకం!
X

విశ్వాసానికి శునకం పెట్టింది పేరని అంటారు. కుక్కలా విశ్వాసంగా ఉండాలి అనేంతగా విశ్వాసం విషయంలో శునకమే ఒక ఉదాహరణ! ఈ సమయంలో మరోసారి శునకం విశ్వాసం తెరపైకి రావడంతోపాటు పోలీసులకు అదే లీడ్ అయ్యిందని అంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని యానాం-ఎదురులంక బాలయోగి బ్రిడ్జి పైనుంచి ఓ గుర్తుతెలియని మహిళ గోదావరిలో దూకిందట. ఇది గమనించిన ఆమె పెంపుడు శునకం గట్టిగట్టిగా అరుస్తూ పరుగులు పెట్టిందట. అనంతరం నీటిలో దూకేముందు తన యజమాని విడిచి పెట్టిన చెప్పుల చుట్టే కలియతిరుగుతూ కనిపించిందట.

దీంతో బ్రిడ్జ్ పై చెప్పులు... ఆవేదనతో కూడినట్లుగా ఉన్న కుక్క అరుపులు గమనించారంట స్థానికులు. దీంతో విషయం అర్ధం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గోదావరిలోకి దూకినట్లు అనుమానిస్తున్న మహిళ కోసం గాలింపు చేపట్టారని అంటున్నారు.

ఇక శునకం మాత్రం తనను ప్రేమగా పెంచుకున్న యజమాని తప్పక తిరిగి వస్తుందన్న ఆశతో అక్కడే చెప్పుల వద్ద ఉందని అంటున్నారు. చీకటిలోనూ తన యజమాని కోసం ఎదురుచూస్తూ బ్రిడ్జిపైనే పడుకుందని తెలుస్తుంది.

ఈ విషయం వారిధిపై వెళ్తున్న వాహనదారులను ఆశ్చర్యానికి గురి చేయగా.. మరికొంతమందితో కంటతడి పెట్టించిందని తెలుస్తుంది. ఇంకొంతమంది ఈ సందర్భంగా హాలీవుడ్ మూవీ "హచికో" ని గుర్తుచేసుకుంటున్నారట.