Begin typing your search above and press return to search.

ఏంటీ మహేష్ నువ్వు కూడానా..?

కానీ సలార్ రిలీజ్ కు ఇంకా మూడు రోజులే ఉన్నా స్టార్ హీరో ప్రభాస్ ఇంతవరకు ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొనలేదు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 4:16 AM GMT
ఏంటీ మహేష్ నువ్వు కూడానా..?
X

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. కొందరు స్టార్ హీరోలు నటిస్తున్న చిత్రాల మేకర్స్ పెద్దగా ప్రమోషన్లు నిర్వహించడం లేదు. మీడియా సంస్థలకు ఆ కథానాయకులు కూడా ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడం లేదు. నాని లాంటి మిడ్ రేంజ్ హీరోలు మూడు నెలల ముందు నుంచే ప్రమోషన్లు ప్రారంభిస్తున్నారు. కానీ సలార్ రిలీజ్ కు ఇంకా మూడు రోజులే ఉన్నా స్టార్ హీరో ప్రభాస్ ఇంతవరకు ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొనలేదు.

ఇప్పుడు మహేశ్ బాబు- తివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ మేకర్స్ కూడా ఇదే పద్దతిని ఫాలో అవుదామని ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ కేవలం ఒక్కే ఒక్క ప్రమోషన్ ఈవెంట్ కు అటెండ్ అవుతారని తెలిసింది. జనవరి 6వ తేదీన జరిగే గుంటూరు కారం ట్రైలర్ కమ్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ కు మాత్రమే మూవీ మేకర్స్ తో కలిసి మహేశ్ హాజరవుతారని సమాచారం.

సినిమా ప్రమోషన్ల భాగంగా యాంకర్ సుమతో ఏర్పాటు చేసే రికార్డెడెడ్ ఇంటర్వ్యూలో పాల్గొనడానికి మహేశ్ అంగీకరించారని చిత్రవర్గాలు తెలిపాయి. అది తప్ప ఏ ఇతర ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడం లేదని తెలుస్తోంది. అయితే గుంటూరు కారం సినిమా కోసం తన తరఫున ఎలాంటి ప్రమోషన్ అవసరం లేదని మహేశ్ భావిస్తున్నారట.

ప్రస్తుతం గుంటూరు కారం మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. కానీ ఆ పాటలకు మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ట్రైలర్ కు గుంటూరు కారం ఘాటు తగిలేలా తివిక్రమ్ రెడీ చేస్తున్నారట. ట్రైలర్ తోనే సినిమాపై అంచనాలు పెంచాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇక సినిమా విషయానికొస్తే.. మహేశ్ సరసన శ్రీలీలతోపాటు మీనాక్షి చౌదరీ లీడ్ రోల్స్ చేస్తున్నారు. జగపతిబాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, సునీల్, రఘబాబు వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ.. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన మూవీ రిలీజ్ కానుంది.