Begin typing your search above and press return to search.

దిల్ రాజు ఇంట పెళ్లిసందడి.. ఏపీ బిజినెస్ మెన్ ఫ్యామిలీతో వియ్యం

నిజానికి ఈ పెళ్లి చర్చలు దిల్ రాజు, శిరీష్ ల తండ్రి మరణానికి ముందే జరిగాయని.. వీరి పెళ్లిని పెద్దలే డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   28 Oct 2023 4:47 AM GMT
దిల్ రాజు ఇంట పెళ్లిసందడి.. ఏపీ బిజినెస్ మెన్ ఫ్యామిలీతో వియ్యం
X

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురి కుటుంబాల్లో పెళ్లిసందడి మొదలైంది. ఆ జాబితాలో దిల్ రాజు కుటుంబం కూడా చేరింది. ఇటీవల దిల్ రాజు తండ్రి మరణ విషాద నేపథ్యంలో.. ఇంట్లో ఒక శుభకార్యం జరిపిస్తే బాగుంటుందన్న వేళ.. పెళ్లిసందడి షురూ అయినట్లుగా చెబుతున్నారు. దిల్ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి త్వరలో పెళ్లి పీటల మీదకు ఎక్కనున్నట్లుగా చెబుతున్నారు. అతగాడ్ని హీరోగా రౌడీ బాయ్స్ మూవీతో వెండితెరకు పరిచయం చేయటం.. ఆ సినిమా పెద్దగా రీచ్ కాకపోవటం తెలిసిందే.

కాస్త గ్యాప్ తీసుకున్న అశిష్.. మరో మూవీతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక వార్త ఇండస్ట్రీలో అందరి నోట నానుతోంది. ఆశిష్ రెడ్డి పెళ్లి చేసేందుకు దిల్ రాజు, ఆయన సోదరుడు ఒక మ్యాచ్ ను ఫిక్సు చేసినట్లుగా చెబుతున్నారు. ఇది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహంగా సమాచారం. పెళ్లి కుమార్తె ఏపీకి చెందిన ఒక వ్యాపారవేత్త ఫ్యామిలీకి చెందిన వారిగా చెబుతున్నారు.

నిజానికి ఈ పెళ్లి చర్చలు దిల్ రాజు, శిరీష్ ల తండ్రి మరణానికి ముందే జరిగాయని.. వీరి పెళ్లిని పెద్దలే డిసైడ్ చేసినట్లుగా చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుందని.. రానున్న రెండు నెలల్లో ఎంగేజ్ మెంట్ చేస్తారని చెబుతున్నారు. వచ్చే ఏడాది మొదట్లో వీరి పెళ్లి ఉంటుందని.. రాజస్థాన్ లోని డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో పెళ్లి ఉంటుందని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 14న పెళ్లి ఉంటుందన్న మాట వినిపిస్తోంది.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఐదేళ్ల క్రితం 2018లోనూ దిల్ రాజు సోదరుడు కుమారుడు హర్షిత్ వివాహం కూడా ఏపీకి చెందిన పొలిటికల్ ఫ్యామిలీతో జరగటం తెలిసిందే. హర్షిత్ విషయానికి వస్తే.. రాజ్ తరుణ్ హీరోగా నటించిన లవర్ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకునే హర్షిత్ వివాహం ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కుమార్తె గౌతమితో జరిగింది. తాజాగా జరగనున్న వివాహం కూడా ఏపీకి చెందిన బిజినెస్ ఫ్యామిలీతో వియ్యం అందుకోవటం ఆసక్తికరంగా మారింది.

మొత్తంగా చూస్తే టాలీవుడ్ లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ పెద్ద ఎత్తున మొదలైందని చెప్పాలి. ఒకపక్క వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి వివాహ వేడుక ఇప్పటికే మొదలుకాగా.. ఇటీవలే విక్టరీ వెంకటేశ్ రెండో కుమార్తె ఎంగేజ మెంట్ ఘనంగా పూర్తైంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహకు ప్రముఖ నటుడు మురళీమోహన్ మనుమరాలు రాగాతో పెళ్లి ఫిక్సు కావటం తెలిసిందే.