Begin typing your search above and press return to search.

మండుటెండల్లో మెగాస్టార్‌ కష్టాలు...!

నేటి నుంచి విశ్వంభర సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్‌ ను ప్రారంభించారు.

By:  Tupaki Desk   |   1 April 2024 6:16 AM GMT
మండుటెండల్లో మెగాస్టార్‌ కష్టాలు...!
X

మెగాస్టార్‌ చిరంజీవి మొన్నటి వరకు విశ్వంభర సినిమా షూటింగ్‌ లో పాల్గొన్నాడు. ఎండలు మండుతున్న నేపథ్యంలో చిరంజీవి వేసవి పూర్తి అయ్యే వరకు విశ్వంభర కు బ్రేక్ ఇవ్వచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది. కానీ చిరంజీవి మాత్రం ఎండలను లక్ష్య పెట్టకుండా మళ్లీ షూట్‌ కి రెడీ అయ్యారు.

నేటి నుంచి విశ్వంభర సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్‌ ను ప్రారంభించారు. హైదరాబాద్‌ లో అత్యంత కీలక సన్నివేశాల చిత్రీకరణకు యూనిట్‌ సభ్యులు సిద్ధం అయ్యారు. ఇప్పటికే షూటింగ్ రెండు షెడ్యూల్‌ పూర్తి చేసిన దర్శకుడు వశిష్ఠ ఈ షెడ్యూల్‌ లో టాకీ పార్ట్‌ ను మరియు ఒక యాక్షన్ సన్నివేశాన్ని షూట్‌ చేస్తున్నాడట.

చిరంజీవితో పాటు కీలక పాత్రల్లో నటిస్తున్న నటీ నటులు మరియు హీరోయిన్ త్రిష కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరోలే ఈ ఎండకు షూటింగ్‌ అంటే భయపడుతూ ఉన్నారు. వేడి, ఉక్క పోత తట్టుకోలేక విదేశాలకు వెకేషన్ కి వెళ్తున్నారు. అలాంటిది చిరంజీవి ఈ వయసులో మండే ఎండల్లో కష్టపడటం గొప్ప విషయం.

చిరంజీవి ఈ షెడ్యూల్‌ ను పూర్తి చేసిన తర్వాత వేసవి సెలవులు తీసుకుంటారని తెలుస్తోంది. ఫ్యామిలీతో కలిసి యూరప్‌ కి వెళ్లాలని చిరంజీవి భావించారని, కానీ ఈ షెడ్యూల్‌ పూర్తి అయితే కీలక సన్నివేశాలు పూర్తి అయ్యి, గ్రాఫిక్స్ వర్క్ జరుగుతాయనే ఉద్దేశ్యంతో కాస్త ఇబ్బంది, కష్టం అయినా కూడా ఎండ వేడికి షూటింగ్‌ లో పాల్గొంటున్నాడట.

బింబిసార సినిమా తర్వాత దర్శకుడు వశిష్ఠ రూపొందిస్తున్న ఈ సినిమా పై మెగా ఫ్యాన్స్‌ చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. భోళా శంకర్ సినిమా తర్వాత చిరంజీవి కాస్త గ్యాప్‌ తీసుకుని ఈ సినిమాకు ఓకే చెప్పాడు. 2025 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

హిట్లర్‌ తరహా లో చిరంజీవి కి ఈ సినిమాలో నలుగురు లేదా అయిదు మంది చెల్లెల్లు ఉంటారని తెలుస్తోంది. హీరోయిన్‌ గా త్రిష నటించడంతో పాటు ఇంకా మృణాల్‌ ఠాకూర్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతుందనే వార్తలు కూడా వచ్చాయి. ఆ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.