Begin typing your search above and press return to search.

విశ్వంభర.. మెగా టార్గెట్లు ఇలా ఉన్నాయి..

జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాని తలపించే విధంగా ముల్లోకాలతో కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ని వశిష్ఠ మల్లిడి మెగాస్టార్ చిరంజీవికి చెప్పి ఒప్పించడం జరిగింది.

By:  Tupaki Desk   |   22 May 2024 4:16 AM GMT
విశ్వంభర.. మెగా టార్గెట్లు ఇలా ఉన్నాయి..
X

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో సోషియో ఫాంటసీగా వచ్చిన యముడికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాని ఇప్పుడు చూసిన ఫ్రెష్ స్టోరీ ఫీలింగ్ కలుగుతుంది. ఆ సినిమాలో చిరంజీవి కూడా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుంచి అలాంటి సోషియో ఫాంటసీ మూవీ రాబోతోంది.

జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమాని తలపించే విధంగా ముల్లోకాలతో కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ ని వశిష్ఠ మల్లిడి మెగాస్టార్ చిరంజీవికి చెప్పి ఒప్పించడం జరిగింది. ఆ కథని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అయ్యారు. దీంతో సినిమా గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ సినిమా కోసం మెగాస్టార్ మళ్ళీ వర్క్ అవుట్స్ చేసి స్లిమ్ అయ్యారు. అలాగే యంగ్ లుక్ లోకి తనని తాను మార్చుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో ఖైదీ నెంబర్ 150తో కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. తరువాత సైరా నరసింహారెడ్డి సినిమాని బయోపిక్ గా హిస్టారికల్ కథాంశంతో చేశారు. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. ఆ తరువాత వచ్చిన గాడ్ ఫాదర్, ఆచార్య సినిమాలు పెద్దగా మెప్పించలేదు. వాల్తేరు వీరయ్య కమర్షియల్ హిట్ అయిన అతనిలో పూర్తిస్థాయి నటుడిని ఆవిష్కరించలేదు.

ఇప్పుడు విశ్వంభర సినిమాతో చిరంజీవి మళ్ళీ ఒకప్పటి మెగాస్టార్ ని గుర్తు చేయబోతున్నారంట. ఇప్పటికే మూవీ ఒక షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ అన్నపూర్ణ 7 ఎకరాల్లో మూవీ కోసం భారీ సెట్ వేశారంట. ఈ సెట్ లోనే లాంగ్ షెడ్యూల్ షూట్ చేయబోతున్నారంట. ఇందులో కీలకమైన సన్నివేశాలు అన్ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ షూటింగ్ షెడ్యూల్ మొదలుకాబోతోందంట.

ఇక సినిమాను 2025 సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు. సినిమా షూటింగ్ ను ఈ ఏడాది అక్టోబర్ లోపు ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. అనంతరం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను 45 రోజుల్లో ఫినిష్ చేయాలని మరో టార్గెట్ సెట్ చేసుకున్నారు. ఇక సినిమా ప్రమోషన్స్ కోసం వీలైనంతగా ఎక్కువ సమయం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. అలాగే మరికొంత మంది స్టార్ హీరోయిన్స్ కూడా మూవీలో భాగం కాబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్ లో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సినిమా తెరకెక్కుతోంది. బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వశిష్ఠ మల్లిడి ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. 2025 సంక్రాంతికి విశ్వంభరతో ఏ స్థాయి బ్లాక్ బస్టర్ ని అందుకుంటారు అనేది వేచి చూడాలి.