Begin typing your search above and press return to search.

ఈ కార‌ణంగానే దేశం విడిచిపెడుతున్న‌ విరుష్క‌!

అయితే పాపుల‌ర్ సెలబ్రిటీ క‌పుల్ విరాట్ కోహ్లీ- అనుష్క శ‌ర్మ జంట త‌మ కుటుంబంతో భార‌త‌దేశాన్ని విడిచి లండ‌న్ లో స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న‌ట్టు చాలా కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి.

By:  Tupaki Desk   |   27 April 2025 9:30 AM
ఈ కార‌ణంగానే దేశం విడిచిపెడుతున్న‌ విరుష్క‌!
X

చాలామంది ప్ర‌జ‌లు భార‌త‌దేశం వ‌దిలి విదేశాల‌కు వెళ్లిపోతున్నారు. అమెరికా, బ్రిట‌న్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయ్, సింగ‌పూర్, కెన‌డా అంటూ ప్ర‌పంచ‌వ్యాప్తంగా భార‌తీయులు విస్త‌రించి ఉన్నారు. వీరంద‌రినీ క‌లిపి ఇండియ‌న్ డాయాస్పోరా అని పిలుస్తున్నారు. అయితే పాపుల‌ర్ సెలబ్రిటీ క‌పుల్ విరాట్ కోహ్లీ- అనుష్క శ‌ర్మ జంట త‌మ కుటుంబంతో భార‌త‌దేశాన్ని విడిచి లండ‌న్ లో స్థిర‌ప‌డాల‌ని అనుకుంటున్న‌ట్టు చాలా కాలంగా క‌థ‌నాలొస్తున్నాయి. వారు త‌మ పిల్ల‌లు వామిక‌, అకాయ్ ల‌ను లండ‌న్ లో పెంచాల‌ని అనుకుంటున్నారు. అందుకే భార‌త‌దేశం విడిచి వెళ్ల‌నున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

అయితే ఈ ప్ర‌చారాన్ని విరుష్క ఖండించ‌నూ లేదు. అలాగ‌ని నిజ‌మేన‌ని అంగీక‌రించ‌నూ లేదు. ఏడాది కాలంగా విరాట్- అనుష్క లండ‌న్ లో ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నార‌ని, అక్క‌డ నివ‌శించేందుకు ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాధురి ధీక్షిత్ భ‌ర్త శ్రీ‌రామ్ నీనే విరుష్క జంట లండ‌న్ కి వెళుతున్నార‌ని ధృవీక‌రించారు. వారికి ఆ ఆలోచ‌న ఎందుకు వ‌చ్చిందో ప్ర‌స్థావించారు.

భార‌త‌దేశంలో సెల‌బ్రిటీల‌కు ప్రైవసీ లేదు. చివ‌రికి తినేట‌ప్పుడు కూడా బాధ్య‌తారాహిత్యంగా సెల్ఫీలు అడుగుతారు. ఇది స్వేచ్ఛ‌ను హ‌రిస్తుంది. కానీ వారంద‌రికీ గౌర‌వం ఇవ్వాలి. సెల్ఫీ ఇవ్వాలి! అని శ్రీ‌రామ్ నీనే అన్నారు. జీవితంలో ప్రైవ‌సీ అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి చెప్పారు. పిల్ల‌లు సుర‌క్షితంగా స్వేచ్ఛ‌గా పెర‌గాలంటే విదేశాలు అయితేనే బావుంటుంద‌ని విరుష్క భావిస్తున్న‌ట్టు అత‌డు స్ప‌ష్ఠంగా చెప్పారు. నిరంత‌రం వెంట‌ప‌డే అభిమానుల‌తో సెల‌బ్రిటీల‌కు దేశంలో గోప్య‌త క‌రువైంద‌ని కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. విరుష్క జంట‌కు ఇదే ప్ర‌ధాన‌ స‌మ‌స్య అని అన్నారు. అనుష్క‌తో ఓసారి మాట్లాడాను. వారు తమ విజయాన్ని ఆస్వాధించలేనందున లండన్‌కు వెళ్లాలని ఆలోచిస్తున్న‌ట్టు తెలిపార‌ని అన్నారు. ఈ జంట ఏం చేసినా తాను అభినందిస్తాన‌ని అన్నారు. సెల‌బ్రిటీలు గొప్ప అభిమానుల కార‌ణంగా ఒత్తిళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుందని శ్రీ‌రామ్ నీనే వ్యాఖ్యానించారు. గోప్య‌త కోసం విదేశాల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని కూడా అభిప్రాయ‌ప‌డ్డారు.