200 కోట్ల బడ్జెట్ తో దేవరకొండ సినిమా!
ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ 200 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు నిర్మాణ వర్గాల నుంచి తెలిసింది.
By: Tupaki Desk | 10 May 2025 12:01 PM ISTవిజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఓ చిత్రం నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 'కింగ్ డమ్' రిలీజ్ అనంతరం విజయ్ ఈ సినిమానే పట్టాలెక్కిం చనున్నాడు. బ్రిటీష్ కాలం నేపథ్యంలో సాగే స్టోరీ ఇది. 1854-1878 మధ్య జరిగిన చారిత్రాత్మక సంఘట నలు ఆధారంగా రూపొందిస్తున్నారు. భారీ కాన్వాస్ పై పిరియాడిక్ చిత్రంగా రూపొందనుంది.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కొన్నాళ్లుగా రాహుల్ ఇదే పనిలో ఉన్నాడు. ఇప్పటికే విజయ్ ద్యాన ముద్రలో ఉన్న పోస్టర్ ను కూడా రిలీజ్ చేసారు. పోస్టర్ తోనే ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటి వరకూ ఎవరూ తెరకెక్కించని పాయింట్ ని తీసుకుని తెరకెక్కిస్తున్నారు? అన్నది అర్దమైంది. బలమైన కథ, క థనాలతో రూపొందుతున్న చిత్రంగా అప్పుడే ప్రచారం పీక్స్ కి చేరింది.
మరి ఈ పాన్ ఇండియా సినిమా బడ్జెట్ ఎంత అన్నది ఇంతవరకూ ఎక్కడా బయటకు రాలేదు. కథని బట్టి బట్టి బడ్జెట్ కూడా భారీగా ఉంటుందని ఓ అంచనా తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం మైత్రీ మూవీ మేకర్స్ 200 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు నిర్మాణ వర్గాల నుంచి తెలిసింది. సినిమాలో సెట్స్ కోసమే 70 కోట్లకు పైగా ఖర్చు అవుతుందిట. ఇది కేవలం ఓ అంచనా మాత్రమే.
1800 నాటి కాలం నాటి కథ అంటే అంతా సెట్స్ లోనే షూటింగ్ చేయాలి. ఆ నాటి కాలాన్ని సెట్స్ రూపం లో తీసుకురావాలి. అదీ ఎంతో వాస్తవికంగా ఉండాలి. సాధారణ సినిమా సెట్స్ కోసమే కోటి రూపాలు ఈజీగా ఖర్చు అవుతుంది. ఈ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి సెట్స్ వేయడం అంటే భారీ ఖర్చు తప్పదు. ఇప్పటికే కొన్ని రకాల సెట్లు సిద్దం చేస్తున్నారు. ఇవన్నీ తొలి దశ షూటింగ్ కి సంబంధించిన సెట్స్ అని సమాచారం.