Begin typing your search above and press return to search.

వంశం.. రక్తం కామెంట్స్ పై మెగా సెటైర్

By:  Tupaki Desk   |   3 Jan 2019 12:49 PM GMT
వంశం.. రక్తం కామెంట్స్ పై మెగా సెటైర్
X
మెగా బ్రదర్ నాగబాబు ఈమధ్య నందమూరి బాలకృష్ణ ను ఉద్దేశించి సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్య గతంలో 'పవన్ కళ్యాణ్ ఎవరు' అన్నందుకు రెస్పాన్స్ గా మెగా బ్రదర్ మొదట ఒక ఇంటర్వ్యూ లో 'బాలకృష్ణ ఎవరు?' అని అడగడం ఓ హాట్ టాపిక్ అయింది. అంతటితో ఆగని నాగబాబు సెటైర్లు సీనియర్ కమెడియన్ వల్లూరి బాలకృష్ణ తెలుసని రెండో పంచ్ వేశాడు. మరోసారి 'సారే జహాసే అచ్చా' విషయంలో సెటైర్ వేస్తూ ఒక చిన్న బాబు స్పష్టంగా అదే పాట పాడిన వీడియో ను పోస్ట్ చేశాడు. ఇది ముచ్చటగా మూడో సెటైర్.

నాగబాబు రచ్చ ఇంతటితో ఆగలేదు. నాలుగో సారి 'వంశం.. రక్తం.. రేర్ బ్రీడ్' కామెంట్స్ పై భారీ సెటైర్ వేశాడు. నాగబాబు తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా అరుదైన జాతి గేదెలు.. దున్నపోతుల ఫోటోలు పోస్ట్ చేసి "ఈ గేదెలు దున్నపోతులు అమ్మకానికి సిద్ధం. ఇవి రేర్ బ్రీడ్ కు చెందినవి.. నాణ్యమైనవి. వీటిని కొనుగోలు చేసేందుకు పైనున్న వెబ్ సైట్లను చూడండి" అంటూ మెసేజ్ పెట్టాడు.

మెసేజ్ ను మాత్రమే చూస్తే ఇది సాధారణంగా కనిపిస్తుంది గానీ నాగ బాబు కామెంట్స్ ను గత కొద్ది రోజులుగా ఫాలో అవుతున్నవారికి మాత్రం వెంటనే ఇది బాలయ్య ను టార్గెట్ చేస్తూ వేసిన చురక అని అర్థం అవుతుంది. నాగబాబు కామెంట్స్ లో తప్పేమీ లేదని.. పవన్ సపోర్ట్ తో 2014 లో టీడీపీ గెలిచిన విషయం మర్చిపోయి పవన్ కళ్యాణ్ తెలియదని బాలయ్య అనడం కరెక్ట్ అయితే.. నాగబాబు కామెంట్లు కూడా కరెక్టే కదా అని కొందరు అంటున్నారు. మరి కొందరు మాత్రం ఏదో ఒకసారి అంటే సరిగానీ అదేపనిగా బాలయ్యను టార్గెట్ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే నాగబాబు సెటైర్లపై బాలయ్య ఇంతవరకూ స్పందించలేదు. ఈ హంగామా అంతా చూస్తుంటే నెక్స్ట్ ఎలెక్షన్స్ సమయానికి ఈ నాగబాబు సెటైర్ల పదును మరింత పెరిగేలా ఉంది.