Begin typing your search above and press return to search.

వెంకీ, అనిల్‌ మూవీ.. పల్లెటూరు+మెసేజ్‌

ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

By:  Tupaki Desk   |   7 Feb 2024 7:44 AM GMT
వెంకీ, అనిల్‌ మూవీ.. పల్లెటూరు+మెసేజ్‌
X

ఈ ఏడాది సంక్రాంతికి సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వెంకటేష్ వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాకు వెంకటేష్ ఓకే చెప్పాడు. దిల్‌ రాజు బ్యానర్ లో నిర్మాణం జరుగబోతున్న ఆ సినిమా 2025 సంక్రాంతికి విడుదల అవ్వబోతుందని అధికారిక ప్రకటన వచ్చింది.

వెంకీ, అనిల్‌ రావిపూడి కాంబో మూవీ పల్లెటూరు నేపథ్యంలో సాగే అందమైన కథా చిత్రం అంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికర వార్త ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సినిమాలో ఒక చక్కని మెసేజ్ ను కూడా కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో పాటు ఇవ్వబోతున్నారట.

పల్లెటూరు ను వదిలి, తల్లిదండ్రులను వదిలి పట్నం వెళ్లి.. పుట్టి పెరిగిన గ్రామాన్ని మరిచి పోవద్దు అనే మెసేజ్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దిల్‌ రాజు బ్యానర్‌ లో వచ్చిన శతమానం భవతి తరహాలోనే ఈ సినిమా ఉంటుందని కూడా చర్చ జరుగుతోంది.

మొత్తానికి పల్లెటూరు నేపథ్యం మరియు మంచి మెసేజ్‌ ఆపై సంక్రాంతికి రిలీజ్. కనుక వెంకీకి చాలా కాలం తర్వాత ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్‌ పడటం ఖాయం అన్నట్లుగా సినీ వర్గాల్లో మరియు ఆయన అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. త్వరలో షూటింగ్‌ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.