Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ కొడుకు.. హీరోగా కాదు..

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఇటీవల తిరుమల వెళ్ళిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక

By:  Tupaki Desk   |   19 Jun 2024 9:51 AM GMT
త్రివిక్రమ్ కొడుకు.. హీరోగా కాదు..
X

టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. ఇటీవల తిరుమల వెళ్ళిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచాక.. ఫ్యామిలీతో త్రివిక్రమ్ అక్కడికి వెళ్లడంతో మొక్కులు తీర్చుకోవడానికి అయ్యి ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే సాధారణంగా త్రివిక్రమ్ లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. ఫ్యామిలీతో పెద్దగా బయట కనిపించరు. కానీ తిరుమలలో ఈసారి మాత్రం ఇద్దరు కొడుకులు, భార్యతో కెమెరాలకు పొజులిచ్చారు.

దీంతో ఆ పిక్స్.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య ఇప్పటికే సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అయితే పిక్స్ లో త్రివిక్రమ్ పెద్ద కొడుకు రిషి.. అందరి దృష్టిని ఆకర్షించారు. ఫోటోల్లో రిషి చాలా హాండ్సమ్ గా కనిపించారు. ఇంకేముంది.. అతడు హీరోగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

కానీ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. రిషి తన తండ్రి బాటలోనే వెళ్ళబోతున్నారని టాక్ వినిపిస్తోంది. హీరోగా కాకుండా.. అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ర్టీలోకి ఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం స్టార్ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రిషి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మొదట హీరోగా చేయమని సితార నాగవంశీ అలాగే మరికొందరు నిర్మాతలు త్రివిక్రమ్ సన్నిహితులు చెప్పినప్పటికీ రిషి మాత్రం తనకు తండ్రి తరహాలోనే డైరెక్షన్ ఇష్టమని క్లారిటీ ఇచ్చేశారట. ఇక కొడుకు టాలెంట్ ను గుర్తించిన త్రివిక్రమ్ తన దగ్గర కాకుండా నేటితరం యువ దర్శకుల వద్ద సహాయక దర్శకుడిగా ఉండేలా చేయడం విశేషం. మరి రిషి తండ్రిగా తగ్గ తనయుడిగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి.

మరోవైపు, త్రివిక్రమ్ చివరగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో గుంటూరు కారం మూవీ చేశారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఆ సినిమా.. అనుకున్నంత స్థాయిలో మెప్పించలేక పోయింది. త్రివిక్రమ్ మార్క్ కూడా కనిపించలేదని రివ్యూస్ వచ్చాయి. ఆ సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ ను ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు. కానీ అల్లు అర్జున్ తో మూవీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప -2 అయ్యాక బన్నీ, త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అట్లీతో అల్లు అర్జున్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో త్రివిక్రమ్ తో బన్నీ నెక్స్ట్ వర్క్ చేయనున్నారని వినికిడి. మరి త్రివిక్రమ్, రిషి కలిసి ఏమైనా సినిమా చేస్తారేమో చూడాలి.