Begin typing your search above and press return to search.

అందరూ అనుకున్నట్టే.. మళ్లీ 18 ఏళ్ల తర్వాత..

త్రిష విశ్వంభర సెట్స్ లోకి అడుగుపెట్టగా.. చిరంజీవితో పాటు మూవీ యూనిట్ ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.

By:  Tupaki Desk   |   5 Feb 2024 9:24 AM GMT
అందరూ అనుకున్నట్టే.. మళ్లీ 18 ఏళ్ల తర్వాత..
X

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టైటిల్ కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ బియాండ్ యూనివర్స్ అంటూ ప్రమోట్ చేస్తున్నారు. విశ్వంభర చాలా కొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు పెట్టేశారు మేకర్స్.

ఇటీవలే చిరంజీవి విశ్వంభర సెట్స్ లోకి అడుగుపెట్టారు. కొన్ని రోజుల క్రితమే జిమ్ లో బాగా కష్టపడుతున్న వీడియోను షేర్ చేసి విశ్వంభర మొదలుపెడుతున్నానని చిరు పోస్ట్ చేశారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ ఎవ‌ర‌నే స‌స్పెన్స్‌ కు తెర‌ప‌డింది. ఈ భారీ బ‌డ్జెట్ సినిమాలో త్రిష హీరోయిన్‌ గా న‌టిస్తోంది. ఈ విష‌యాన్ని ఇన్‌ స్టాగ్రామ్ లో చిరంజీవి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

త్రిష విశ్వంభర సెట్స్ లోకి అడుగుపెట్టగా.. చిరంజీవితో పాటు మూవీ యూనిట్ ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఆ వీడియోను చిరుతోపాటు నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో షేర్ చేసింది. గత కొన్ని రోజులుగా త్రిష ఈ సినిమాలో చిరంజీవి సరసన నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు అధికారికంగా అదే ప్రకటించారు. ఇక చిరు, త్రిష కలిసి 18 ఏళ్ల క్రితం స్టాలిన్ సినిమాలో నటించారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు విశ్వంభరలో మళ్లీ కలిసి యాక్ట్ చేస్తున్నారు.

అయితే చిరు నటించిన ఆచార్య‌లో హీరోయిన్‌ గా త్రిష‌ నే మేకర్స్ ముందుగా ప్ర‌క‌టించారు. కానీ షూటింగ్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ కార‌ణంగా త‌ప్పుకుంటున్న‌ట్లు త్రిష అనౌన్స్‌ చేసింది. ఈ బ్యూటీ ప్ర‌క‌ట‌న అప్ప‌ట్లో ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ గా మారింది. దీంతో చిరు, త్రిష మ‌ళ్లీ క‌లిసి సినిమా చేయ‌డం అనుమాన‌మేనంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఇప్పుడు ఈ పుకార్ల‌కు పుల్‌ స్టాప్ పడింది.

ఇక, విశ్వంభరలో త్రిష కాకుండా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒకరు సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ అని సమాచారం. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జ‌న‌వ‌రి 10వ తేదీన రిలీజ్ కాబోతోంది. ఏడాది ముందే ఈ సినిమా రిలీజ్ డేట్‌ ను మేకర్స్ అనౌన్స్‌ చేశారు. దాదాపు రూ.150 కోట్ల బ‌డ్జెట్‌తో యూవీ క్రియేష‌న్స్ ప‌తాకంపై వంశీ, ప్ర‌మోద్‌, విక్ర‌మ్ నిర్మిస్తున్నారు.