Begin typing your search above and press return to search.

యానిమాల్ పిల్లకు.. ఈసారి భయపెట్టే సినిమా..

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ

By:  Tupaki Desk   |   21 Feb 2024 1:30 PM GMT
యానిమాల్ పిల్లకు.. ఈసారి భయపెట్టే సినిమా..
X

సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీతో లైమ్ లైట్ లోకి వచ్చింది బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ. ఆ సినిమా రిలీజ్ తర్వాత సెన్సేషనల్ గర్ల్ అయిపోయింది. యానిమల్ చిత్రంలో కనిపించింది కాసేపే.. కానీ తన యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో నేషనల్ లెవెల్ లో క్రేజ్ సంపాదించుకుంది. హీరోయిన్ రష్మిక కన్నా ఈమే టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

యానిమల్ రిలీజైన ఫస్ట్ షో నుంచే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా త్రిప్తినే కనిపించింది. ఆమె సోషల్ మీడియా అకౌంట్లకు ఒక్కసారిగా ఫాలోవర్స్ పెరిగిపోయారు. తాను ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా వైరల్ అయిపోతుంది. అంతలా యానిమల్ మూవీ.. త్రిప్తి జాతకమే మార్చేసింది. ఇక యానిమల్ తర్వాత క్రేజీ ఆఫర్స్ కూడా త్రిప్తికి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల బాలీవుడ్ కల్ట్ క్లాసీ ఆషికీ సీక్వెల్ ఆషికీ-3లో ఛాన్స్ కొట్టేసిన త్రిప్తి.. మరో క్రేజీ ఆఫర్ దక్కించుకుంది. హిందీ చంద్రముఖి భూల్ భూలయ్యా థర్డ్ పార్ట్ లో త్రిప్తి కీలక పాత్రలో నటించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ మూవీలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తుండగా.. సీనియర్ నటి విద్యాబాలన్ మళ్లీ ముంజులికగా భయపెట్టనుంది.

ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కు జోడీగా త్రిప్తి నటించనున్నట్లు సమాచారం. యూత్ లో మంచి ఫ్యాన్ బేస్ ఉన్న త్రిప్తిని మేకర్స్ తీసుకోవడంతో ఈ హారర్ కామెడీ మూవీపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. అయితే భూల్ భూలయ్యా-1లో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, అమీషా పటేల్ లీడ్ రోల్స్ చేశారు. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సెకండ్ పార్ట్ లో కార్తీక్ ఆర్యన్, టబు, కియారా అద్వానీ నటించారు. ఈ చిత్రం కూడా మంచి హిట్ అయింది.

ఇక మూడో భాగానికి ముంజులికగా మళ్లీ విద్యాబాలన్ ను తీసుకున్నారు మేకర్స్. సెకండ్ పార్ట్ కు దర్శకత్వం వహించిన అనీస్ బాజ్మీ.. భూల్ భూలయ్యా-3ని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్.. 2024 దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుంది. అయితే తెలుగులో మాత్రం చంద్రముఖి హిట్ అయినా.. దాని సీక్వెల్ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. లారెన్స్, కంగన నటించిన ఈ మూవీ ప్రేక్షకులను అస్సలు మెప్పించలేకపోయింది. మరి మూడో పార్ట్ తెలుగులో తెరకెక్కుతుందో లేదో చూడాలి.