Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో హోల్డ్ లో పడిన సినిమాలివే!

మరికొన్ని సినిమాలు వేరే ఇతర కారణాలతో హోల్డ్ లో పడతాయి. ఇవి ఎప్పుడు వస్తాయి, అసలు వస్తాయా రావా అనేది కూడా క్లారిటీ ఉండదు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 8:30 AM GMT
టాలీవుడ్ లో హోల్డ్ లో పడిన సినిమాలివే!
X

కొన్ని సినిమాలు ఎనౌన్స్ జరిగి తరువాత ఎందుకనో సెట్స్ వరకు వెళ్లకుండానే ఆగిపోతాయి. మరికొన్ని ప్రాజెక్ట్స్ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత దర్శకుడు, హీరో మధ్య క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగానో, లేదంటే బడ్జెట్ సమస్యల వలనో ఆగిపోతాయి. మరికొన్ని సినిమాలు వేరే ఇతర కారణాలతో హోల్డ్ లో పడతాయి. ఇవి ఎప్పుడు వస్తాయి, అసలు వస్తాయా రావా అనేది కూడా క్లారిటీ ఉండదు.

అలాంటి సినిమాల జాబితా చూసుకుంటే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో జెజిఎం(జనగణమన) మూవీ స్టార్ట్ అయ్యి కొంత షూటింగ్ కూడా అయ్యాక ఆగిపోయింది. దీనికంటే ముందుగా వీరి కాంబినేషన్ లో వచ్చిన లైగర్ డిజాస్టర్ కావడంతో ఆ ఎఫెక్ట్ జేజిఎంపైన పడింది. అలాగే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో స్టార్ట్ అయిన మూవీకి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.

దేవర కంటే ముందుగా కొరటాల శివ, అల్లు అర్జున్ కాంబినేషన్ లో యువసుధా ఆర్ట్స్ బ్యానర్ లో పాన్ ఇండియా మూవీని ఎనౌన్స్ చేశారు. ఒక రఫ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆచార్య డిజాస్టర్ తర్వాత ఈ మూవీ గురించి ఇక ఎలాంటి సౌండ్ లేదు. అల్లు అర్జున్, వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో దిల్ రాజు ఐకాన్ అనే సినిమా ఎనౌన్స్ చేశారు. ఇది ఆగిపోయిందని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ ఇప్పుడు నితిన్ తో తమ్ముడు టైటిల్ తో మూవీ చేసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా స్టార్ట్ అయ్యింది. షూటింగ్ కూడా చాలా వరకు జరిగింది. అయితే ప్రస్తుతం అయితే హోల్డ్ లో ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల వలన సినిమా షూటింగ్ వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తోంది. మరో వైపు ఈ సినిమా పూర్తిగా క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం నడుస్తోంది.

మంచు మనోజ్, ఆదికేశవ ఫేమ్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో అహం బ్రహ్మాస్మి అనే సినిమాని ఎనౌన్స్ చేశారు. అయితే ఇది షూటింగ్ కూడా స్టార్ట్ కాకుండానే ఆగిపోయింది. నిఖిల్ హీరోగా సుధీర్ వర్మ మూడో సినిమా కూడా ఎనౌన్స్ అయ్యి షూటింగ్ కొద్ది రోజుల జరిగిన తర్వాత క్యాన్సిల్ అయ్యింది. బెల్లంకొండ శ్రీనివాస్ టైగర్ నాగేశ్వరరావు, కర్ణన్ రీమేక్ లు కూడా ఎనౌన్స్ అయినా తర్వాత ఆగిపోయాయి. రీసెంట్ గా రవితేజ, గోపిచంద్ కాంబోలో నాలుగో సినిమా ఎనౌన్స్ అయ్యి బడ్జెట్ కారణాలతో క్యాన్సిల్ అయ్యింది. ఆ సినిమాని ఇప్పుడు హిందీ హీరోతో చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు.