Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లీడింగ్ లేడీ ఎవరు..?

అయితే ఉన్న వారిలో ఎవరు ముందు ఎవరు తర్వాత అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది

By:  Tupaki Desk   |   30 April 2024 3:40 AM GMT
టాలీవుడ్ లీడింగ్ లేడీ ఎవరు..?
X

ఎన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నా కూడా స్టార్ హీరోల సినిమాలకు గ్లామర్ తీసుకు రావాలంటే మాత్రం అది కథనాయికల వల్లే అవుతుంది. స్టార్ సినిమాల్లో హీరోయిన్స్ కి కూడా ఈమధ్య డిమాండ్ బాగా పెరిగింది. ఓ పక్క కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరో పక్క తమ ప్రతిభ చాటేలా ప్రయోగాత్మక సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టిస్తున్న టలీవుడ్ లో ప్రస్తుతం లీడింగ్ లేడీ ఎవరన్నది చెప్పడం కష్టం. అయితే ఉన్న వారిలో ఎవరు ముందు ఎవరు తర్వాత అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది.

టాలీవుడ్ లోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో దూసుకెళ్తుంది కన్నడ భామ రష్మిక మందన్న. లాస్ట్ ఇయర్ యానిమల్ హిట్ తో అమ్మడికి మరింత ప్రోత్సాహం అందింది. ఈ ఇయర్ పుష్ప 2 లో మరోసారి శ్రీవల్లి పాత్రతో రాబోతుంది. అంతేకాదు ది గర్ల్ ఫ్రెండ్ మూవీ కూడా ఈ ఇయర్ రాబోతుంది. చేతినిండా సినిమాలతో అటు ఫేం వైజ్.. ఇటు సక్సెస్ వైజ్ రెండిటిలో రష్మిక దూసుకెళ్తుంది.

ఆ తర్వాత వరుస సినిమాలు చేయకపోయినా సరే సాయి పల్లవి అంటే తెలుగు ఆడియన్స్ కు విపరీతమైన క్రేజ్. రెండేళ్ల గ్యాప్ తీసుకున్నా కూడా సాయి పల్లవి టాలీవుడ్ లో లీడింగ్ లోనే ఉంది. ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తున్న అమ్మడు బాలీవుడ్ లో రామాయణం తో పాటుగా ఆమీర్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది. సాయి పల్లవి కూడా ఇటు సౌత్ అటు నార్త్ అనే తేడా లేకుండా అదరగొట్టేస్తుంది.

ఆ నెక్స్ట్ ప్లేస్ లో ఎన్.టి.ఆర్ తో దేవర లో జత కట్టిన జాన్వి కపూర్ వస్తుందని చెప్పొచ్చు. దేవర తో టాలీవుడ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వి ఆ సినిమా రిలీజ్ అవ్వకుండానే రాం చరణ్ బుచ్చి బాబు కాంబో సినిమాలో ఛాన్స్ అందుకుంది. దేవర ఈ ఇయర్ దసరాకి రాబోతుంది. ఈ సినిమాతో జాన్వికి తెలుగులో అద్భుతమైన స్వాగతం ఏర్పడుతుంది.

ఆ తర్వాత కోలీవుడ్ భామ ప్రియాంక అరుల్ మోహన్ ఊహించని విధంగా టాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తుంది. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ కాగా మరొకటి నాని హీరోగా చేస్తున్న సరిపోదా శనివారం. ఈ సినిమాలు రెండిటితో టాలీవుడ్ లో క్రేజ్ తెచ్చుకోనుంది ప్రియాంక.

అందాల భామ మీనాక్షి చౌదరి కూడా టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది. వరుణ్ తేజ్ మట్కాతో పాటుగా వెంకటేష్ అనీల్ రావిపుడి సినిమాలో కూడా మీనాక్షి నటిస్తుందని తెలుస్తుంది. గుంటూరు కారం లో చిన్న పాత్రతో సరిపెట్టుకున్నా అమ్మడికి వరుస లక్కీ ఆఫర్లు వస్తున్నాయని చెప్పొచ్చు.

ఇక సీతారామం, హాయ్ నాన్నలతో సక్సెస్ అందుకున్న మృణాల్ ఠాకూర్ థర్డ్ మూవీ ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అయినా ఆమెకు మరో ఛాన్స్ ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తిగా ఉన్నారు. మరో హిట్ పడితే మృణాల్ తిరిగి తెలుగులో తన ఫాం కొనసాగించే ఛాన్స్ ఉంటుంది. ఇదే దారిలో శ్రీలీల కూడా మొన్నటిదాకా చేతినిండా సినిమాలతో హడావిడి చేసింది. గుంటూరు కారం తర్వాత ఆమె కావాలని గ్యాప్ తీసుకుందో లేక ఎలాంటి అవకాశాలు రాలేదో కానీ శ్రీలీల ప్రస్తుతం సైలెంట్ అయిపోయింది.

మరోపక్క సీనియర్ హీరోయిన్స్ అయిన అనుష్క, సమంత తిరిగి సినిమాలు చేస్తున్నారు. అనుష్క క్రిష్ డైరెక్షన్ లో సినిమా చేస్తుంది. సమంత తన సొంత బ్యానర్ లో మూవీ అనౌన్స్ చేసింది. టాలీవుడ్ లో ఈ ఇద్దరికి ఉన్న క్రేజ్ తెలిసిందే. వీళ్లు ఫాం లోకి వస్తే మిగతా హీరోయిన్స్ కి కష్టమే అని చెప్పొచ్చు.