Begin typing your search above and press return to search.

హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి ద్రోహం చేశారు..!

ఆర్య, నయనతార, నజ్రియా, జై లు నటించిన రాజా రాణి లో సాక్షి అగర్వాల్‌ కొన్ని నిమిషాల పాటు కనిపించిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   3 Feb 2024 6:25 AM GMT
హీరోయిన్ ఛాన్స్ అని చెప్పి ద్రోహం చేశారు..!
X

గత ఏడాది బాలీవుడ్ లో వచ్చిన షారుఖ్‌ ఖాన్‌ మూవీ జవాన్ తో వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన అట్లీ మొదటి సినిమా రాజా రాణి వార్తల్లో నిలిచింది. ఆర్య, నయనతార, నజ్రియా, జై లు నటించిన రాజా రాణి లో సాక్షి అగర్వాల్‌ కొన్ని నిమిషాల పాటు కనిపించిన విషయం తెల్సిందే.


తాజాగా సాక్షి అగర్వాల్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... నేను బెంగళూరు లో మోడలింగ్ చేస్తున్న సమయంలో రాజా రాణి సినిమాలో నటించేందుకు ఛాన్స్ వచ్చింది. ఆడిషన్స్ చేసి ఎంపిక చేశారు. అట్లీ దర్శకత్వంలో ఆర్యకు హీరోయిన్ గా అంటూ నాతో సినిమాకు సెకండ్‌ హీరోయిన్‌ గా అగ్రిమెంట్‌ చేసుకున్నారు.

కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా చేశారు. తదుపరి షెడ్యూల్‌ కి పిలుస్తామని అన్నారు. ఆ తర్వాత వారి నుంచి నాకు కాల్‌ రాలేదు. కొన్ని రోజుల తర్వాత సినిమా షూటింగ్‌ పూర్తి చేసి విడుదల చేయడం జరిగింది. సినిమాలో నన్ను ఒక సన్నివేశానికే పరిమితం చేసి ద్రోహం చేశారు అంటూ సాక్షి అగర్వాల్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

సినిమా నుంచి నన్ను తొలగించిన విషయమై యూనిట్‌ సభ్యులతో తాను ఆ సమయంలో మాట్లాడలేదు. అప్పుడే అట్లీ తో మాట్లాడి ఉంటే బాగుండేది. ఆయనతో ఆ సమయంలో మాట్లాడక పోవడం నేను చేసిన పెద్ద తప్పుగా నేను భావిస్తున్నాను. సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌ ఛాన్స్ అంటూ చాలా పెద్ద ద్రోహం చేశారని సాక్షి చేసిన కామెంట్స్ వైరల్‌ అవుతున్నాయి.

ఇంటర్వ్యూలో సాక్షి చేసిన వ్యాఖ్యల పై యూనిట్‌ ఆ సినిమా యూనిట్‌ సభ్యులు ముఖ్యంగా అట్లీ ఏమైనా స్పందిస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సోషల్‌ మీడియాలో సాక్షి కి మద్దతుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.