హీరోయిన్ రేంజ్ లో బాలయ్య కూతురు.. బిగ్ సర్ప్రైజ్
మొదటిసారి తేజస్విని ఒక యాడ్ ఫిల్మ్ కోసం స్క్రీన్ మీద కనిపించారు. ప్రముఖ 'సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్'కు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా మారారు.
By: M Prashanth | 31 Oct 2025 11:22 AM ISTనందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలు రావడం, ఇండస్ట్రీని ఏలడం కామన్. కానీ, ఆ ఫ్యామిలీ ఆడపడుచులు ఎక్కువగా ప్రొడక్షన్, బిజినెస్ వైపే వెళ్తారనేది అందరికి తెలిసిందే. ఇక నందమూరి బాలకృష్ణ రెండవ కుమార్తె తేజస్విని కూడా ఇప్పటివరకు అదే రూట్లో ఉన్నారు. 'అఖండ 2' లాంటి భారీ ప్రాజెక్టులకు నిర్మాతగా వ్యవహరిస్తూ, కెమెరా వెనుకే యాక్టివ్గా ఉంటున్నారు. కానీ, ఇప్పుడు ఆమె సడన్గా కెమెరా ముందుకొచ్చి అందరికీ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు.
మొదటిసారి తేజస్విని ఒక యాడ్ ఫిల్మ్ కోసం స్క్రీన్ మీద కనిపించారు. ప్రముఖ 'సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్'కు ఆమె బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఈ యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్లో తేజస్విని లుక్స్, ఆమె స్మైల్, ఎక్స్ప్రెషన్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది కేవలం యాడ్లా కాకుండా, ఒక కాన్సెప్ట్తో కూడిన మినీ మూవీలా ఉండటం విశేషం. డి.యమునా కిషోర్ డైరెక్ట్ చేయగా, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ దీనికి సంగీతం అందించడం విశేషం.
ఇక కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. యాడ్ మొదట్లో తేజస్విని ఒక మోడ్రన్, స్పోర్టీ గర్ల్గా ఇండోర్ రాక్ క్లైంబింగ్ చేస్తూ కనిపిస్తారు. కష్టపడి ఆ గోడను ఎక్కిన ఆమెకు, పైకి వెళ్ళగానే చేతికి ఉన్న పెద్ద డైమండ్ రింగ్ హైలెట్ అవుతుంది. ఆ తర్వాత సీన్ కట్ చేస్తే, ఆ రింగ్ కాస్తా ఒక స్టైలిష్ బ్రేస్లెట్గా మారి ఆమె చేతికి కనిపిస్తుంది. ఒక లగ్జరీ రాల్స్ రాయిస్ కారులోంచి ఆమె ఒక ప్యాలెస్ లాంటి చోట దిగుతారు. ఇక్కడ ఆమె లుక్ పూర్తిగా మారిపోతుంది.
స్పోర్టీ లుక్ నుంచి రాయల్ లుక్లోకి ట్రాన్స్ఫార్మ్ అవ్వడం మరో హైలెట్. మరో దశలో, ఒక పెళ్లి సందడి, సంగీత్ వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ తేజస్విని రెండు డిఫరెంట్ లుక్స్లో అదరగొట్టారు. మొదట, స్టైలిష్ వైట్ లెహంగాలో, డైమండ్ నెక్లెస్తో చాలా గ్రేస్ఫుల్గా డ్యాన్స్ చేస్తారు. ఆ వెంటనే, ఎర్రటి పట్టుచీరలో, పక్కా ట్రెడిషనల్ టెంపుల్ జ్యువెలరీ, వడ్డాణంతో ఎంతో హుందాగా, అందంగా కనిపిస్తారు.
నిజానికి, ఆమె కెమెరా ముందు ఇంత కంఫర్టబుల్గా ఉండటంలో ఆశ్చర్యం లేదు. నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మనవరాలిగా, బాలకృష్ణ కుమార్తెగా.. నటన అనేది ఆమెకు రక్తంలోనే ఉంది. అందుకే, మొదటిసారి కెమెరా ఫేస్ చేసినా, ఏమాత్రం బెరుకు లేకుండా, చాలా క్యూట్ గా, గ్లామర్ గా యాడ్ను క్యారీ చేశారు. ఇక సిద్ధార్థ ఫైన్ జ్యువెలర్స్ ఓనర్లు నాగిని ప్రసాద్ వేమూరి, శ్రీమణి మతుకుమిల్లి, శ్రీదుర్గ కాట్రగడ్డ.. తేజస్వినిని అంబాసిడర్గా ఎంచుకుని తమ బ్రాండ్కు రిచ్ లుక్, క్లాస్ టచ్ ఇచ్చారు. ఇక ఫ్యూచర్లో ఆమెకు మరిన్ని బ్రాండ్ ఎండార్స్మెంట్స్ ఆఫర్స్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
