Begin typing your search above and press return to search.

ఆ 11 మంది డెత్ సీక్రెట్‌ తమన్నా రివీల్‌...!

ఈ వెబ్‌ సిరీస్‌ 2018 లో జరిగిన ఢిల్లీ సామూహిక ఆత్మహత్య సంఘటనల ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్ ను రూపొందించడం జరిగింది.

By:  Tupaki Desk   |   14 Aug 2023 10:48 AM GMT
ఆ 11 మంది డెత్ సీక్రెట్‌ తమన్నా రివీల్‌...!
X

మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ తో కలిసి నటించిన జైలర్ సినిమా మరియు మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి నటించిన భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఒక్క రోజు గ్యాప్‌ లో వచ్చిన ఈ రెండు సినిమాలు కూడా తమన్నాకి పెద్దగా హెల్ఫ్‌ అయినట్లుగా కనిపించడం లేదు.

ఒక వైపు ఆ రెండు సినిమాలు చేస్తూనే మరో వైపు 'ఆఖ్రి సచ్‌' అనే వెబ్‌ సిరీస్ లో నటించింది. ఈనెల 25న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ 2018 లో జరిగిన ఢిల్లీ సామూహిక ఆత్మహత్య సంఘటనల ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్ ను రూపొందించడం జరిగింది.

2018 లో ఢిల్లీ లోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది ఆత్మహత్య చేసుకున్నారు. క్షుద్ర పూజలు చేసి ఈ కుటుంబం మొత్తం మళ్లీ బతుకుతాం అనే నమ్మకంతో ఆత్మహత్యలు చేసుకున్నారు అనే ప్రచారం జరిగింది. ఆ సంఘటన గురించి ఇప్పటికే నెట్‌ ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీ వచ్చింది.

ఆ డాక్యుమెంటరీ లో రియల్‌ పాత్రలు, లొకేషన్స్ ను మరియు పోలీస్ ఆఫీసర్ ను చూపించడం జరిగింది. కానీ తమన్నా నటించిన 'ఆఖ్రి సచ్‌' సిరీస్ లో మాత్రం ఫాంటసీ కథ మరియు స్క్రీన్‌ ప్లే ను చూపించబోతున్నారు. దేశం మొత్తం షాక్ అయిన ఈ సంఘటన పై వెబ్ సిరీస్ రాబోతున్న నేపథ్యంలో అందరిలో ఆసక్తి నెలకొంది.

ఈ మధ్య కాలంలో తమన్నా వరుసగా వెబ్‌ సిరీస్‌ లతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవల వచ్చిన లస్ట్‌ స్టోరీస్ 2 మరియు జీ కర్ద సిరీస్ లు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. ఇక తాజా సిరీస్ తో ఢిల్లీలో చనిపోయిన 11 మంది డెత్‌ సీక్రెట్‌ పై క్లారిటీ వచ్చేనా అనేది చూడాలి.