ఆ సినిమా ఎందుకు హిట్ అయిందో అర్థం కాదు
తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
By: Tupaki Desk | 23 April 2025 11:26 AM ISTతెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. సినిమాకు ఒక వైపు భారీ వసూళ్లు దక్కిన సమయంలోనే మరో వైపు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. హీరో పాత్ర మొదలుకుని హీరోయిన్ పాత్ర, విలన్ పాత్ర ఇలా ప్రతి పాత్రను దర్శకుడు సందీప్ వంగ చూపించిన తీరు ఏ మాత్రం సబబు కాదు అనే అభిప్రాయంను వ్యక్తం చేశారు. చాలా మంది సందీప్ వంగ మేకింగ్ను విమర్శిస్తే, కొందరు మాత్రం ఆయన సినిమా మేకింగ్ చాలా బాగుంది అంటూ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత జనరేషన్కి ఇలాంటి దర్శకులు కావాలంటూ కొందరు ఆ సమయంలో కామెంట్స్ చేశారు.
యానిమల్ సినిమా విడుదలై ఏడాది దాటినా ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెగ్యులర్గా సందీప్ రెడ్డి వంగ మేకింగ్ స్టైల్ను, ఆయన యానిమల్ సినిమాలోని కొన్ని బోల్డ్ సన్నివేశాలను విమర్శిస్తూనే ఉంటారు. తాజాగా జాతీయ అవార్డ్ గ్రహీత, ప్రముఖ రచయిత స్వానంద్ కిర్కిరే ఈ విషయమై స్పందించారు. ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాలు, ప్రస్తుత పరిస్థితులపై స్పందించాడు. ఆ సమయంలోనే స్వానంద్ 'యానిమల్' సినిమా గురించి స్పందించాడు. యానిమల్ సినిమా పై ఆయన తీవ్రమైన విమర్శలు చేశాడు. అలాంటి సినిమా ఎలా హిట్ అయిందో, ఎందుకు హిట్ చేశారో అర్థం కాలేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.
స్వానంద్ మాట్లాడుతూ... సినిమా గురించి తాను ఎక్కువగా మాట్లాడాలి అనుకోవడం లేదు. కానీ ఇలాంటి సినిమాను జనాలు ఎలా ఆదరించారు, ఏ కారణం చేత సినిమాను ఎక్కువ మంది ప్రేక్షకులు చూశారు అనేది అర్థం కాలేదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. తనకు తెలిసిన ఒక అమ్మాయి యానిమల్ సినిమా రెండు సార్లు చూశాను అంది. దాంతో ఆమెను మీరు యానిమల్ సినిమాను చూడ్డానికి కారణం ఏంటని ప్రశ్నించిన సమయంలో ఆమె సినిమాలో బాబీ డియోల్ మ్యాన్లీనెస్ కోసం రెండు సార్లు చూశాను అంటూ చెప్పుకొచ్చింది. విలన్ పాత్ర కోసం రెండు సార్లు చూడటం ఆశ్చర్యంగా అనిపించింది. సినిమా మేకింగ్ ఎలాగైనా ఉండవచ్చు. కానీ సినిమాలను ప్రేక్షకులు ఆధరించడంపైనే నా వాదన అన్నట్లుగా స్వానంద్ అసహనం వ్యక్తం చేశాడు.
పురుషుల్లో రకాలను వివరించిన మేకర్స్ దాన్ని పూర్తిగా క్లారిటీ ఇవ్వలేదు. కొంత వరకు వారు తమ అభిప్రాయాలను నిజం అని నమ్మించేందుకు ప్రయత్నించినా ఓవరాల్గా పురుషుల విషయంలో అందరి మాదిరిగానే స్క్రీన్ప్లే సాగింది. సినిమాలోని పాటలు, సన్నివేశాలు కవిత్వ భావగీతాలపై ఎక్కువగా ఉండటం చూస్తూ ఉంటే.. వారు ఏదైతే చెబుతున్నారో అది అబ్బదం అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలను తీయడం ఇండస్ట్రీకి పెద్ద నష్టం లేదు, అలా అని లాభం కూడా లేదు. కానీ ఇలాంటి సినిమాలు హిట్ అవ్వడం అనేది సమాజానికి మంచిది కాదు అన్నట్లుగా స్వానంద్ కిర్కిరే అన్నారు. యానిమల్ సినిమాను గతంలోనూ పలువురు సీనియర్ నటులు విమర్శించిన విషయం తెల్సిందే. ఇప్పుడు సీనియర్ రచయిత ఈ విషయమై స్పందించాడు. స్వానంద్ కిర్కిరే వ్యాఖ్యలకు సందీప్ వంగ ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి .