Begin typing your search above and press return to search.

వెండి తెరపై మరో స్టార్‌ క్రికెటర్‌

ఇండియాలో క్రికెట్‌కు, సినిమా ఇండస్ట్రీకి చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి.

By:  Tupaki Desk   |   4 July 2025 1:00 AM IST
వెండి తెరపై మరో స్టార్‌ క్రికెటర్‌
X

ఇండియాలో క్రికెట్‌కు, సినిమా ఇండస్ట్రీకి చాలా సన్నిహిత సంబంధాలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ వారితో క్రికెటర్స్‌కి సన్నిహిత సంబంధాలు ఉండటం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తున్న విషయం తెల్సిందే. ఎంతో మంది క్రికెటర్స్ సినిమా స్టార్స్‌ను పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్‌ స్టార్స్‌ ఎంతో మంది టీం ఇండియా స్టార్‌ క్రికెటర్స్‌తో సన్నిహిత సంబంధాలు, వ్యాపార సంబంధాలు ఉంటాయి. అందుకే చాలా సందర్భాల్లో క్రికెటర్స్ సినిమాల్లో కనిపించారు. కొన్ని సార్లు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించడం మనం చూస్తూ ఉంటాం. కొందరు మాత్రం ఫుల్‌ లెంగ్త్‌ పాత్రల్లోనూ నటించడం మనం ఈ మధ్య కాలంలో చాలా కామన్‌గా చూస్తూ ఉన్నాం.

ఇప్పటికే టీం ఇండియా క్రికెటర్స్‌లో కపిల్‌ దేవ్‌, ఇర్ఫాన్ పఠాన్‌, శ్రీశాంత్‌, హర్భజన్ సింగ్‌తో పాటు కొందరు లేడీ క్రికెటర్స్ కూడా సినిమాల్లో నటించడం మనం చూశాం. శ్రీశాంత్‌ లీడ్‌ రోల్‌లో నటించి నటుడిగా ప్రశంసలు దక్కించుకున్నాడు. ఇక చాలా మంది క్రికెటర్స్ జీవితాలను వెండి తెరపైకి తీసుకు వచ్చి సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్నారు. అందుకే ఇండియన్‌ క్రికెటర్స్‌ ఏదో ఒక సమయంలో సినిమాల్లో కనిపించడం లేదా, వారి జీవిత చరిత్ర సినిమాగా రావడం కామన్‌గా జరుగుతుంది. త్వరలో మరో స్టార్ క్రికెటర్ కూడా వెండి తెరపై కనిపించబోతున్నాడు. ఒక తమిళ సినిమా ద్వారా ఆయన ప్రేక్షకుల ముందుకు రావడం ఖాయం అని తెలుస్తోంది.

ఐపీఎల్‌లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ క్రికెటర్‌గా కొనసాగిన సురేష్‌ రైనా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్నాడు. గతంలో ఎన్నో కమర్షియల్‌ యాడ్స్‌లో నటించిన అనుభవం సురేష్‌ రైనాకి ఉంది. కేవలం కమర్షియల్‌ యాడ్స్‌లో మాత్రమే కాకుండా కొన్ని మెసేజ్ ఓరియంటెడ్‌ యాడ్స్‌లోనూ నటించాడు. కనుక సినిమాల్లో నటించే సమయంలో పెద్దగా ఇబ్బంది ఉండక పోవచ్చు. ఒక తమిళ సినిమా కోసం సురేష్ రైనాను సంప్రదించడం, ఆయన గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో సౌత్ సినిమాలకు పాన్ ఇండియా రేంజ్‌లో మంచి స్పందన దక్కుతుంది. అందుకే తమిళ్‌ సినిమాలో సురేష్ రైనా నటించేందుకు ఓకే చెప్పాడని సమాచారం.

సురేష్ రైనా 226 వన్డేలు ఆడి 35.31 సగటుతో 5615 పరుగులు సాధించాడు, 36 అర్థ సెంచరీలు 5 శతకాలు ఉన్నాయి. 13 సంవత్సరాల వయస్సులోనే క్రికెట్ ఆటపై దృష్టి పెట్టినాడు. చిన్న వయస్సులోనే అండర్-16 ఉత్తర ప్రదేశ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్ పర్యటించాడు. 2004లో అండర్-19 ప్రపంచ కప్ పోటీలలో కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఆ ప్రపంచ కప్ పోటీలలో కేవలం 38 బంతుల్లో 90 పరుగులు సాధించడమే కాకుండా మొత్తం 3 అర్థ సెంచరీలు సాధించాడు. సచిన్ టెండుల్కర్‌కి గాయపడటంతో 2005 లో శ్రీలంకలో జరిగిన ఇండియన్ ఆయిల్ కప్ లో పాల్గొన్నాడు.