Begin typing your search above and press return to search.

రాజ‌కీయాల నుంచి PSPK కి బిర్యానీ ఉప‌శ‌మ‌నం!

మ‌రి లాంటి వ‌దిన‌మ్మ చేసిన బిర్యానీ తిన‌కోపోతే ఎలా? అందుకే మూడు రోజుల క్రిత‌మే వ‌దిన‌మ్మ వండిన చికెన్ బిర్యానీ తిన‌డానికి హైద‌రాబాద్ లో చిరంజీవి ఇంటికొచ్చి తిని వెళ్లాడుట‌.

By:  Tupaki Desk   |   8 March 2024 7:07 AM GMT
రాజ‌కీయాల నుంచి PSPK కి బిర్యానీ ఉప‌శ‌మ‌నం!
X

ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేన అధినేత‌..ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నారో తెలిసిందే. టీడీపీతో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డానికి రెడీ అవ్వ‌వ‌డంతో ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌హా ప్ర‌జ‌ల్లోనే ఎక్కువ‌గా ఉంటున్నారు. రేయింబ‌వ‌ళ్లు క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. గెలుపే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నారు. ఎప్పుడు తింటున్నారు? ఎప్పుడు ప‌డుకుంటున్నారో? ఆయ‌న‌కే తెలియ‌నంత బిజీగా ఉన్నారు.

మ‌రి ఇంత బిజీలో వ‌దిన‌మ్మ చేతి చికెన్ బిర్యానీ మిస్ అవ్వ‌లేదా? అంటే అవున‌నే తెలుస్తోంది. చిరంజీవి స‌తీమ‌ణి పెద్ద వ‌దిన సురేఖ అంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి త‌ల్లి స‌మానం. పీకే చిరంజీవి ఇంట్లోనే ఉండ‌టంతో సురేఖ క‌న్న బిడ్డ‌లాగే చూసుకునేవారు. అందుకే రామ్ చ‌ర‌ణ్ ....పీకేని బాబాయ్ అని కూడా పిల‌వ‌లేదు. పీకే ని ఓ బ్ర‌ద‌ర్ లా ట్రీట్ చేస్తుంటాడు. వ‌దిన‌మ్మ అంటే పీకే ఎంతో ఆరాదిస్తాడు. త‌ల్లి త‌ర్వాత త‌ల్లి స్థానం మా వ‌దిన‌మ్మ‌దే అంటూ ఎన్నో సంద‌ర్భాల్లో చెప్పాడు.

మ‌రి లాంటి వ‌దిన‌మ్మ చేసిన బిర్యానీ తిన‌కోపోతే ఎలా? అందుకే మూడు రోజుల క్రిత‌మే వ‌దిన‌మ్మ వండిన చికెన్ బిర్యానీ తిన‌డానికి హైద‌రాబాద్ లో చిరంజీవి ఇంటికొచ్చి తిని వెళ్లాడుట‌. ప‌వ‌న్ క‌ళ్యాష్ స్వ‌యంగా వ‌దిన‌మ్మ‌కి ఫోన్ చేసి ఈరోజు వ‌స్తాను అని చెప్ప‌గానే సురేఖ ప‌వ‌న్ కోసం ప్ర‌త్యేకంగా చికెన్ బిర్యానీ రెడీ చేసి పెట్టార‌ని కోడ‌లు ఉపాస‌న ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేయ‌డంతోనే విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

మొత్తానికి ప‌వ‌న్ కిది అతిపెద్ద ఉప‌శ‌మ‌నం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. రోజు రాజ‌కీయ స‌భ‌లు.. స‌మావేశాలతో బ‌య‌ట పుడ్ తినాల్సి వ‌స్తోంది. అదీ టైమ్ కి తిన‌లేని ప‌రిస్థితి. అలాగే హైద‌రాబాద్ కి వెళ్లి కూడా చాలా రోజులు కావ‌డంతో కుటుంబ స‌భ్యుల్ని చూడాల‌నిపించి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. త‌ల్లి అంజ‌నా దేవి కూడా అక్క‌డే ఉంటున్నారు. వాళ్లంద‌ర్నీ చూసొచ్చిన‌ట్లు ఉంటుంద‌ని పీకే అప్ప‌టిక‌ప్పుడు హైద‌రాబాద్ వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.