Begin typing your search above and press return to search.

రేవంత్ తో ఫొటో.. ట్రోల్స్ పై సుప్రీత ఫైర్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రేవంత్ రెడ్డిని అభినందిస్తూ వీళ్ళు ఆయనతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

By:  Tupaki Desk   |   5 Dec 2023 5:56 AM GMT
రేవంత్ తో ఫొటో.. ట్రోల్స్ పై సుప్రీత ఫైర్
X

ప్రముఖ టాలీవుడ్ నటి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి ఆమె కూతురు సుప్రీత ఇద్దరికీ సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ముఖ్యంగా సురేఖ వాణి కూతురు సోషల్ మీడియాలో తన గ్లామర్ తో నెటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తూ హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. సినిమాల్లోకి రాకముందే సుప్రీత సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సురేఖ వాణి కూడా కూతురితో కలిసి రీల్స్ చేస్తూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇక సోషల్ మీడియాలో వీరికి రోజురోజుకు ఫాలోయింగ్ కూడా గట్టిగానే పెరుగుతోంది. గ్లామర్ తో ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటారు అని కామెంట్స్ కూడా వస్తుంటాయి. ఇలాంటి తరుణంలో కొందరు నెటిజనులు అదేపనిగా వారిని టోల్ చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం ట్రోల్స్ ని ఏమాత్రం పట్టించుకోరు. కానీ ఒక్కోసారి ఆ ట్రోల్స్ హద్దులు దాటితే మాత్రం కచ్చితంగా రియాక్ట్ అవుతారు. తాజాగా సురేఖ వాణి కూతురు సుప్రీత అదే పని చేసింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో రేవంత్ రెడ్డిని అభినందిస్తూ వీళ్ళు ఆయనతో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో చూసిన కొందరు నెటిజన్స్ వీరిపై తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు. దానికి ప్రధాన కారణం ఎన్నికలకు ముందు ఈ తల్లికూతుళ్లు BRS గెలవాలని రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ ఎన్నికల తర్వాత BRS ఓడిపోయింది. కాంగ్రెస్ గెలిచింది. దాంతో సుప్రీత ఆ రీల్స్ డిలీట్ చేసి రేవంత్ రెడ్డి తో దిగిన ఫోటోను షేర్ చేసింది.

దీంతో ఈ తల్లి కూతుర్లపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మరికొందరైతే బూతులతో దాడి చేస్తున్నారు. తాజాగా దీనిపై సుప్రీత రియాక్ట్ అవుతూ.." రాజకీయ వివాదంలో నన్ను ట్యాగ్ చేసి మరీ వేధిస్తున్నారు. నేను మొదట BRS కు సపోర్ట్ చేశాను. అందులో తప్పేముంది. అదేవిధంగా గెలిచిన వ్యక్తి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పాను. ఈ మాత్రానికి నన్ను ట్రోల్ చేయడమేంటి? నేను మీకేం అన్యాయం చేశాను. నాపై ఎందుకింత ద్వేషం పెంచుకున్నారు. మీరు చేస్తున్న ట్రోలింగ్ వల్ల నా మానసిక ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి" అంటూ సుప్రీత తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది.

దీంతో ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి ఎన్నికల ముందు BRS పార్టీ కోసం చాలామంది సినీ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలా రీల్స్ చేసి ప్రచారం చేశారు. శ్రీముఖి, శివజ్యోతిజ్ అషు రెడ్డి తో పాటు బుల్లితెర నటీనటులు హైదరాబాద్ అభివృద్ధి గురించి చెబుతూ వీడియోలు తీశారు. పెయిడ్ ప్రమోషన్స్ లో భాగంగానే వీళ్లంతా ఇలా రీల్స్ చేసి ఉండొచ్చని టాక్ వస్తోంది. ఇక ఇవన్నీ గమనించని నెటిజన్స్ వాళ్ళని ట్రోల్స్ చేస్తుండడంతో సదరు సెలబ్రిటీలకి ఇది కాస్త తలనొప్పిగా మారుతోంది.