సర్ ప్రైజ్ చేసిన రాజమౌళి అండ్ కో!
తాజాగా పీసీ మళ్లీ హైదరాబాద్లో ల్యాండ్ అయింది. కొన్ని రోజుల క్రితమే ముంబైకి చేరుకున్న అమ్మడు హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది.
By: Tupaki Desk | 19 April 2025 7:30 AM# ఎస్ ఎస్ ఎంబీ 29 ఇటీవలే రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్, ఓడిశాలో రెండు షెడ్యూళ్లను ముగించారు. అనంతరం ప్రియాంకచోప్రా న్యూయార్క్ కి వెళ్లిపోయింది. తదుపరి షెడ్యూల్ విదేశాల్లో ఉంటుందని...అక్కడ నుంచి షూటింగ్ స్పాట్ కు చేరుకుంటుందని ప్రచారం జరిగింది. కానీ మూడవ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుందని తేలిపోయింది.
తాజాగా పీసీ మళ్లీ హైదరాబాద్లో ల్యాండ్ అయింది. కొన్ని రోజుల క్రితమే ముంబైకి చేరుకున్న అమ్మడు హైదరాబాద్ లో ప్రత్యక్షమైంది. ఈ వారంలోనే కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. దీనిలో భాగంగా పీసీ రాజమౌళి ముందొస్తు పిలుపు మేరకు హైదరాబాద్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి కొత్త షెడ్యూ ళ్లకు ముందు అవసరం మేర వర్క్ షాప్స్ నిర్వహిస్తుంటారు.
ఈ క్రమంలోనే పీసీ ముందుగా హాజరైందా? లేక వ్యక్తిగత పనులు మీద వచ్చిందా? అన్నది క్లారిటీ లేదు. వాస్తవానికి మూడవ షెడ్యూల్ ఫారిన్ లో ఉంటుందని వార్తలొచ్చాయి. కానీ అందుకు భిన్నంగా ఇక్కడే కొత్త షెడ్యూల్ మొదలవ్వడం ఆసక్తికరం.మరి ఈ షెడ్యూల్ హైదరాబాద్ లోనే ఉంటుందా? ఏదైనా స్టూడి యోలో నిర్వహిస్తారా? ప్రత్యేక సెట్లలో చేస్తారా? కంటున్యూటీగా మళ్లీ ఫారెస్ట్...హిల్స్ బాట పడతారా? అన్నది తెలియాలి.
అడ్వెంచర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో? ఈ సినిమా షూటింగ్ నటీనటులు సహా అందరికీ సవాల్ గానూ మారుతుంది. ఒడిశా షెడ్యూల్ లో భాగంగా లీకులు ఏ స్థాయిలో జరిగాయో తెలిసిందే. శిఖరాల్లో షూటింగ్ కావడంతో అడ్డుకట్ట వేయడం సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో కొత్త షెడ్యూల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలతో ముందుకెళ్తున్నారో చూడాలి.