Begin typing your search above and press return to search.

వీడియో : కఠిన పరిస్థితుల మధ్య షెడ్యూల్‌ పూర్తి

గోపీచంద్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరికి కూడా ఈ సినిమా అత్యంత కీలకం

By:  Tupaki Desk   |   10 Feb 2024 7:27 AM GMT
వీడియో : కఠిన పరిస్థితుల మధ్య షెడ్యూల్‌ పూర్తి
X

గోపీచంద్‌ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. వీరిద్దరికి కూడా ఈ సినిమా అత్యంత కీలకం. గతంలో బ్లాక్ బస్టర్ విజయాలను దక్కించుకున్న దర్శకుడు శ్రీను వైట్ల గత కొంత కాలంగా తీవ్రమైన ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. అందుకే ఈ విజయం ఆయనకు కీలకం.

ఇక యాక్షన్‌ హీరోగా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న గోపీచంద్‌ కూడా గత కొంత కాలంగా సక్సెస్‌ లు లేక సతమతం అవుతున్నారు. ఇలాంటి వీరిద్దరు కలిసి కసిగా ఒక సినిమాను చేస్తున్నారు. ఆ సినిమా పై ప్రారంభం అయిన రోజు నుంచే కొందరు ఆసక్తి కనబర్చుతూ సినిమా ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ ను హిమాచల్ ప్రదేశ్ లో పూర్తి చేసినట్లుగా దర్శకుడు శ్రీను వైట్ల వీడియోను షేర్ చేసి మరీ ప్రకటించాడు. అత్యంత కఠి పరిస్థితులు మరియు ఇబ్బందికర వాతావరణం లో సినిమాను చిత్రీకరించినట్లు వైట్ల షేర్ చేసిన వీడియోను చూస్తే అర్థం అవుతుంది.

ఇంకా టైటిల్ ను ఖరారు చేయని ఈ సినిమా నుంచి గోపీచంద్ లుక్ ను కూడా రివీల్‌ చేయలేదు. మంచి సమయం, సందర్భం చూసి సినిమా యొక్క టైటిల్‌ ను ప్రకటించిడంతో పాటు ఫస్ట్‌ లుక్ ను కూడా విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది.

మరో వైపు గోపీచంద్‌ 'భీమా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆ సినిమా పై కూడా గోపీచంద్‌ మరియు ఆయన ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. మార్చి మొదటి వారంలోనే భీమా విడుదల అవ్వబోతుంది. వైట్ల సినిమా కూడా ఇదే ఏడాది లో విడుదల చేస్తారని సమాచారం అందుతోంది.