విడాకుల పుకార్లపై విరుచుకుపడ్డ స్టార్ హీరోయిన్
తాజాగా ఒక అవివేకి ``విడాకులు మీకు చాలా దగ్గరగా ఉన్నాయి`` అని వ్యాఖ్యానించాడు. దీనికి సోనాక్షి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
By: Tupaki Desk | 17 April 2025 5:08 PMబాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన సహనటుడు జహీర్ ఇక్భాల్ ని మతాంతర వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట వివాహం సోనాక్షి కుటుంబంలో కలతలకు కారణమైందని బాలీవుడ్ మీడియాలో కథనాలొచ్చాయి. కానీ సోనాక్షి - జహీర్ జంటను సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా పెళ్లిలో ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత చాలా విషయాలు సద్ధుమణిగాయి.
కానీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. మతాంతర వివాహానికి వ్యతిరేకంగా విమర్శలను ఊహించిన సోనాక్షి ఇంతకుముందు సోషల్ మీడియాల్లో అందుకు ఆస్కారం లేకుండా లాక్ చేసి ఉంచింది. కేవలం తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను మాత్రమే షేర్ చేసింది. ఆ తర్వాత భర్తతో ఆనంద క్షణాలను ఇన్ స్టాలో డాక్యుమెంట్ చేస్తోంది.
అయితే ఇంతలోనే నెటిజనులు హద్దు మీరి కామెంట్లు చేయడం ప్రారంభించారు. తాజాగా ఒక అవివేకి ``విడాకులు మీకు చాలా దగ్గరగా ఉన్నాయి`` అని వ్యాఖ్యానించాడు. దీనికి సోనాక్షి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ముందుగా మీ తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటారు.. తర్వాత మేము వాగ్దానం చేస్తాము! అని విరుచుకుపడ్డారు.
ఇంతకుముందు పెళ్లి సమయంలో ట్రోలర్స్ పై సోనాక్షి తండ్రి, నటుడు నాయకుడు శత్రుఘ్న సిన్హా విరుచుకుపడ్డారు. వివాహం అనేది వ్యక్తిగత ఎంపిక అని, దానిని ఆపేందుకు ఇతరులకు రైట్ లేదని అన్నారు. పని లేని వాళ్లు మాత్రమే ఇలాంటి కూతలు కూస్తారని కూడా శత్రుఘ్న ఫైర్ అయ్యారు. నా కుమార్తె చట్టవిరుద్ధమైన లేదా రాజ్యాంగ విరుద్ధమైనది ఏదీ చేయలేదు అని మీడియాతో వ్యాఖ్యానించారు.
సోనాక్షి సిన్హా - జహీర్ ఇక్బాల్ 23 జూన్ 2024న వివాహం చేసుకునే ముందు దాదాపు ఏడు సంవత్సరాలు డేటింగ్ చేశారు. ఈ జంట జహీర్ ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత సాయంత్రం వారి పరిశ్రమ స్నేహితుల కోసం పార్టీ ఏర్పాటు చేశారు. సోనాక్షి అంతకుముందు ప్రియుడి కోసం గోడ దూకిన విషయాన్ని కూడా బయటపెట్టారు. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. సోనాక్షి ఇటీవల తొలి తెలుగు చిత్రం `జటాధార` షూటింగ్ను పూర్తి చేసింది.