మాకు ఆదిదేవుడు అల్లు అరవింద్ గారు: SKN
ఆస్తుల్లో వాటా గురించి అడక్కపోవడం తమ మంచితనం, తమ సంస్కారమని అన్నారు. రాసి ఇచ్చేయడం అరవింద్ గారి మంచితనమని వ్యాఖ్యానించారు.
By: Tupaki Desk | 12 Jun 2025 4:39 PMటాలీవుడ్ నిర్మాత ఎస్కేఎన్ గురించి అందరికీ తెలిసిందే. పీఆర్వో గా కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పుడు నిర్మాతగా వరుస సినిమాలను నిర్మిస్తున్నారు. బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎస్కేఎన్.. ఇప్పుడు పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా మిత్రమండలి టీజర్ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ వచ్చి.. అల్లు అరవింద్ ను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
"ఏఏఏ మల్టీప్లెక్స్ అంటే మనదే. అల్లు అరవింద్ గారు రాయకపోయినా మాకు అన్ డివైడెడ్ షేర్ ఉన్నట్లు ఫీలవుతాం. ఇది మాకు లక్కీ ప్లేస్. బేబీ ట్రైలర్, సింగిల్ సహా అనేక అప్డేట్స్ ఇక్కడే లాంచ్ చేశాం. ఏ హోమం చేసినా ఫస్ట్ మనం వినాయకుడికి పూజ చేస్తాం. అయితే మాకు మాత్రం ఆది దేవుడు అల్లు అరవింద్ గారే" అని తెలిపారు ఎస్కేఎన్.
ఆయన పాదపద్మములకు నమస్కారం అని అన్నారు. దీంతో ఆడిటోరియంలో ఉన్నవాళ్లంతా నవ్వారు. ప్రపంచానికి తెలిసి అల్లు అరవింద్ గారికి ముగ్గురు పిల్లలని.. కానీ తాను, బన్నీ వాస్ ను కూడా పిల్లల్లాగే చూసుకుంటారని చెప్పారు. జూబ్లిహిల్స్ 36 చివర్లలో ఉన్న పెద్ద బిల్డింగ్ రాసే తమకు ఇచ్చే ఛాన్స్ లేకపోలేదని ఎస్కేఎన్ చమత్కరించారు.
ఆస్తుల్లో వాటా గురించి అడక్కపోవడం తమ మంచితనం, తమ సంస్కారమని అన్నారు. రాసి ఇచ్చేయడం అరవింద్ గారి మంచితనమని వ్యాఖ్యానించారు. థ్యాంక్యూ సార్ అంటూ నవ్వేశారు. పెంట్ హౌస్ తనదని అన్నారు. ఆ తర్వాత అల్లు అరవింద్ ఫుల్ గా నవ్వేశారు. ఆడిటోరియంలో ఉన్న వాళ్లు కూడా గొల్లుమని నవ్వారు.
అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది. దీంతో మరోసారి ఎస్కేఎన్ తన స్పీచ్ తో అదరగొట్టారని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఎస్కేఎన్ స్పీచెస్ కు స్పెషల్ ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. తన మాటలతో కార్యక్రమంలో ఉన్న వారందరిలో జోష్ నింపుతారు.
ఇప్పుడు మిత్రమండలి టీజర్ రిలీజ్ ఈవెంట్ లో కూడా అదే జరిగింది. ఎప్పటిలానే తన మార్క్ స్పీచ్ తో మెప్పించారు. ఆడిటోరియంలో ఒక్కసారిగా అంతా నవ్వులే నవ్వులు. అదే సమయంలో ఆయన మాట్లాడిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. నెటిజన్లను ఆకర్షిస్తుందనే చెప్పాలి.