Begin typing your search above and press return to search.

అనాధ బాల‌ల మ‌ధ్య‌లో సితార సంద‌డి!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన `గుంటూరు కారం` సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   21 Jan 2024 10:17 AM GMT
అనాధ బాల‌ల మ‌ధ్య‌లో సితార సంద‌డి!
X

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన `గుంటూరు కారం` సంక్రాంతి కానుక‌గా రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. తొలి రోజు సినిమాకి నెగిటివ్ టాక్ వ‌చ్చినా త‌ర్వాత నెమ్మ‌ది పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. క్ర‌మేపీ వ‌సూళ్లు పెరిగాయి. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా ప్రేక్ష‌కుల‌కు ఎక్కేసింది. దీంతో బ్రేక్ ఈవెన్ సాధ్య‌మైంది. ఈ నేప‌థ్యంలోనే మ‌హేష్ సైతం మీడియా ముందుకొచ్చి త‌న సంతోషాన్ని పంచుకున్నారు.


సాధార‌ణంగా సినిమా ప్లాప్ అయితే మహేష్ అస్స‌లు బ‌య‌ట క‌నిపించ‌రు. అందులోనూ మీడియాకి అస్స‌లు చిక్క‌రు. గుంటూరు కారం తొలిరోజు టాక్ చూసి ఆయ‌న కూడా నిరాశ‌ప‌డే ఉంటారు. కానీ ఆ త‌ర్వాత బాక్సాఫీస్ వ‌సూళ్లు చూసి సంతోష ప‌డ్డారు. విజ‌యాన్ని ఆయ‌న న‌మ్మారు కాబ‌ట్టే మీడియా ముందుకొచ్చారు. తాజాగా మ‌హేష్ ఏంఎంబీ మాల్ లో అనాధ బాల కోసం కుమార్తె సితార ప్ర‌త్యేక షో వేసి చూపించిన‌ట్లు తెలుస్తోంది.


దానికి సంబంధించిన ఫోటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. చుట్టూ అనాధ బాల‌ల మ‌ధ్య‌లో సితార న‌వ్వుతూ క‌నిపించింది. జీన్స్ ప్యాంట్ వైట్ క‌ల‌ర్ టీష‌ర్ట్ దానిపైనా ఎరుపు రంగు కోట్ ధ‌రించింది. సితార ముఖంలో సంతోషాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇలా అనాధ బాల‌ల‌కు షో వేయాలి అన్న ఆలోచ‌న కూడా సితార దే. వెనుక మామ్ న‌మ్ర‌త కూడా సల‌హా ఇవ్వ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా షో వేసిన‌ట్లు తెలుస్తోంది.


మ‌హేష్ లాగే సితార దాతృహృద‌యం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. తొలి సంపాద‌న జ్యూవెల‌రీ యాడ్ కి గాను అందుకున్న పారితోషికాన్ని చారిటీకి ఇచ్చేసి అంద‌రి మ‌న‌సు గెలుచుకుంది. ఇప్పుడు అనాద బాల‌ల‌కు ఉచితంగా త‌న సొంత మాల్ లో షో వేసి వాళ్ల క‌ళ్ల‌లో ఆనందాన్ని చూసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ అవుతుంది. సితార సింప్లిసిటీకి అంతా ఫిదా అవుతున్నారు.