శింబు పాలిట మణిరత్నం దేవుడు!
తాజాగా ఈ రెండు అంశాలపై శింబు 'థగ్ లైఫ్' ఆడియో వేదికగా స్పందించాడు.
By: Tupaki Desk | 25 May 2025 4:30 PMకోలీవుడ్ నటుడు శింబుకు వివాదాలు కొత్తేం కాదు. అప్పుడప్పుడు వివాదాస్పద అంశాల్లో శింభు ప్రేరు చర్చకొస్తుంటుంది. అప్పట్లో శింబు పాడిన బీప్ సాంగ్ పెద్ద దుమారాన్నే రేపింది. ఈ పాటతో కించపరి చినట్లు ఉందని ఆల్ ఇండియా డెమొక్రటిక్ వుమన్స్ అసోసియేషన్ మహిళా హక్కుల సంఘానికి ఫిర్యాదులు అందాయి. పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. అలాగే శింబు తీరు కారణంగా అవకాశాలు రాకుండా రెడ్ కార్డు జారీ చేసినట్లు వార్తలొచ్చాయి.
తాజాగా ఈ రెండు అంశాలపై శింబు 'థగ్ లైఫ్' ఆడియో వేదికగా స్పందించాడు. 'నా బీప్ సాంగ్ వివాదాస్ప దమైంది. నా జీవితంలో అదోక క్లిష్ట పరిస్థితి. ఆ సమయంలో రెహమాన్ ఎంతో సహాయం చేసారు. నాకోసం ఆయన ప్రయాణాన్ని రద్దు చేసుకుని సినిమా కోసం నిలబడ్డారు. గాయకుడిగా తొలి అవకాశం ఆయనే ఇచ్చారు. దాదాపు 150 పాటలు పాడాను. నాపై రెడ్ కార్డ్ జారీ అంటూ వార్తలొచ్చాయి.
అప్పుడు నాతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ముందుకు రాలేదు. సినిమాలు లేక కష్టంగా అనిపిం చింది. అలాంటి సమయంలో నన్ను నమ్మి నాతో సినిమా చేసేందుకు ముందుకొచ్చింది మణిరత్నం గారు. 'థగ్ లైఫ్' కోసం ఆయన నిర్మాణ సంస్థ నుంచి ఫోన్ వస్తే నమ్మలేదు. ఆ తర్వాత ఆయన్ని కలిసినప్పుడు నిజంగానే నాకు ఫోన్ చేసారా? అని అడిగాను. 'పొన్నియన్ సెల్వన్' లో అవకాశం రానప్పటికీ 'థగ్గ్ లైఫ్' లో ఛాన్స్ ఇచ్చారు.
ఆయన ఎప్పటికీ నా గురువు. నా గాడ్ ఫాదర్ అని చెప్పగలను అంటూ శింబు కన్నీళ్లు పెట్టుకున్నాడు. శింబు ట్యాలెంటెడ్ నటుడైనా ఆయన వ్యక్తిత్వం కారణంగా చాలా అవకాశాలు కోల్పోయాడు. ఇండస్ట్రీలో హీరోగా ఓ వెలుగు వెలగాల్సిన నటుడు. కార్తీ, సూర్య రేంజ్ ని మించి ఫాలోయింగ్ ఉన్న నటుడు. కానీ కొన్ని రకాల నిర్ణయాలతో శింబు కెరీర్ స్లో అయింది.