గర్భంతో ఉన్న భార్యకు భర్త కాస్ట్లీ గిప్ట్
బాలీవుడ్ ప్రేమ పక్షులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు.
By: Tupaki Desk | 26 April 2025 7:05 PM ISTబాలీవుడ్ ప్రేమ పక్షులు సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈ సారి వారు వార్తల్లో నిలిచింది వారి సినిమాల విషయంలోనో, కెరీర్ విషయంలోనో కాదు. వారి పర్సనల్ లైఫ్ లో జరిగిన విషయంలో ఈ జంట వార్తల్లో నిలిచారు. కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా త్వరలోనే ఓ బిడ్డకు జన్మనివ్వనున్న విషయం తెలిసిందే.
దీంతో కియారాకు ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఓ ఖరీదైన కారుని గిఫ్టుగా ఇచ్చాడు. 2014లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కియారా తర్వాత అదే ఇండస్ట్రీకి చెందిన సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తర్వాత 2023లో ఇరు కుటుంబీకుల ఒప్పందంతో పెళ్లి చేసుకుని ఒకటైన ఈ జంట ఈ ఏడాది ఫిబ్రవరిలో గుడ్ న్యూస్ చెప్పారు. తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అందరికీ తెలియచేస్తూ కియారాఇన్స్టాలో పోస్ట్ చేసింది.
తాజాగా కియారా రెగ్యులర్ చెకప్స్ లో భాగంగా హాస్పిటల్ దగ్గర కనిపించింది. అయితే వారిద్దరూ ఈ సారి హాస్పిటల్ కు వచ్చింది ఓ కొత్త కారులో. ఆ కారు టొయాటో కంపెనీ చెందిన వెల్ఫైర్ అనే మోడల్ కు చెందింది. కియారా చెకప్స్ కోసం హాస్పిటల్ కు వచ్చిన టైమ్ లో సిద్ధార్థ్ ఈ కారును కియారా కోసం కొన్నాడనే వార్త బయటపడింది. ఈ కారు ధర అక్షరాలా రూ.1.22 కోట్లు.
కియారా ప్రెగ్నెంట్ అని తెలియగానే ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రా ఆమెకు ఈ కారుని బహుమతిగా ఇచ్చాడని, మిగిలిన కార్లతో పోలిస్తే ఈ కారు చాలా విలాసవంతంగా ఉంటుందని లోపల స్పేస్ తో పాటూ అన్ని సౌకర్యాలు ఉంటాయని అందుకే తన భార్యకు సిద్ధార్థ్ ఈ కారును బహుకరించాడని అంటున్నారు. కోటికి పైగా విలువైన ఈ కారులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.
ప్రెగ్నెన్సీ టైమ్ లో జర్నీ చేయడానికి ఎంతో సౌకర్యవంతమైన కారుగా దీనికి మంచి పేరుంది. ఈ లగ్జరీ కారు అక్షయ్ కుమార్, ఐశ్వర్యా రాయ్, అనిల్ కపూర్, అజయ్ దేవగన్, రాకేష్ రోషన్, అమీర్ ఖాన్, రిషబ్ శెట్టి లాంటి వారితో పాటూ మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్ కు కూడా ఉంది.