Begin typing your search above and press return to search.

మళ్లీ పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్.. మనీష్ మల్హోత్రా స్పెషల్ విషెస్!

టీమిండియా 'గబ్బర్' శిఖర్ ధావన్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. తన చిరకాల స్నేహితురాలు సోఫీ షైన్‌ను వివాహమాడి రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.

By:  Madhu Reddy   |   23 Feb 2026 4:05 PM IST
మళ్లీ పెళ్లి చేసుకున్న శిఖర్ ధావన్.. మనీష్ మల్హోత్రా స్పెషల్ విషెస్!
X

టీమిండియా 'గబ్బర్' శిఖర్ ధావన్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు. తన చిరకాల స్నేహితురాలు సోఫీ షైన్‌ను వివాహమాడి రెండోసారి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఢిల్లీ వేదికగా అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైదానంలో పరుగుల వరద పారించే ధావన్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో సోఫీతో కలిసి సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




ఢిల్లీలో వేడుకగా 'గబ్బర్' పెళ్లి.. సందడి చేసిన చాహల్:

శిఖర్ ధావన్, సోఫీ షైన్‌ల వివాహ వేడుక శనివారం ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ధావన్ అత్యంత సన్నిహితుడు, టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. "మేరే యార్ కీ షాదీ హై" నా స్నేహితుడి పెళ్లి అంటూ చాహల్ పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పెళ్లి దుస్తుల్లో ధావన్, సోఫీ జంట చూడముచ్చటగా ఉండగా, చాహల్ తన డాన్స్‌తో పెళ్లి వేడుకలో రచ్చ రచ్చ చేశారు.




మనీష్ మల్హోత్రా డిజైన్స్‌లో మెరిసిన జంట:

ఈ పెళ్లి వేడుకలో మరో హైలైట్ ఏమిటంటే, ఈ కొత్త జంట ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన 'ఇనాయ' (Inaya) సమ్మర్ కలెక్షన్ 2026 దుస్తుల్లో మెరిసిపోవడం. సోఫీ తన హల్దీ, సంగీత్ వేడుకల్లో ఎంతో రేడియంట్‌గా కనిపించగా, రిసెప్షన్‌లో ఈ జంట రాయల్ లుక్‌లో ఆకట్టుకుంది. ఇక మనీష్ మల్హోత్రా స్వయంగా సోషల్ మీడియా వేదికగా ఈ జంటకు అభినందనలు తెలుపుతూ.. "మీరు మీ వెడ్డింగ్ అండ్ రిసెప్షన్‌లో ఎంతో అద్భుతంగా ఉన్నారు" అని పోస్ట్ చేశారు. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను, ఆనందాన్ని తన క్రాఫ్ట్ ద్వారా చూపించడం గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు.




ప్రేమ నుంచి పెళ్లి వరకు.. కొత్త ప్రయాణం:

ధావన్, సోఫీ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. 2025లో తమ బంధాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన ఈ జంట, అప్పటి నుండి సోషల్ మీడియాలో సరదా రీల్స్‌తో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ధావన్‌కు ఇది రెండో వివాహం కాగా, మొదటి భార్య అయేషా ముఖర్జీతో 2021లో విడాకులు తీసుకున్నారు.ఇక గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధావన్, ఇప్పుడు జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తీసుకున్నారు. 'మిస్టర్ ఐసీసీ'గా పేరున్న గబ్బర్, తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా అంతే సంతోషంగా ఉండాలని క్రికెట్ ప్రపంచం కోరుకుంటోంది.