Begin typing your search above and press return to search.

కమ్ముల ధనుష్ కాంబో.. ఎంత వరకు వచ్చిందంటే..

అయితే తెలుగులో శేఖర్ కమ్ములతో కమిట్ అయిన సినిమా తర్వాత తన దర్శకత్వంలో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

By:  Tupaki Desk   |   16 Oct 2023 5:30 PM GMT
కమ్ముల ధనుష్ కాంబో.. ఎంత వరకు వచ్చిందంటే..
X

ఫీల్ గుడ్ చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి శేఖర్ కమ్ముల . ఫిదా, లవ్ స్టొరీ సినిమాలతో రెండు సూపర్ హిట్ సినిమాలు ఖాతాలో వేసుకున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ హీరోగా మల్టీ స్టారర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఎప్పుడో ఎనౌన్స్ చేశారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ధనుష్ తో పాటు కింగ్ నాగార్జున కూడా నటిస్తున్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఏషియన్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. భారీ బడ్జెట్ తో యాక్షన్ కమ్ పొలిటికల్ డ్రామా ఈ చిత్రంలో ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే సార్ మూవీ తర్వాత ధనుష్ చేస్తోన్న సెకండ్ స్ట్రైట్ తెలుగు మూవీ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ ని రిలీజ్ చేసే పనిలో ఉన్నారు.

దీంతో పాటు తన దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీని కూడా ఎనౌన్స్ చేశారు. అయితే తెలుగులో శేఖర్ కమ్ములతో కమిట్ అయిన సినిమా తర్వాత తన దర్శకత్వంలో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం కింగ్ నాగార్జున నా సామి రంగా అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ధనుష్ తో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

2025 ఆరంభంలోనే ధనుష్, నాగార్జున కాంబో మూవీ థియేటర్స్ లోకి రానుందని టాక్. శేఖర్ కమ్ముల కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ చేయబోతున్నాడు. ఏషియన్ గ్రూప్ శ్రీ వెంకటేశ్వర సినిమాస్ అమిగోస్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ మూవీ కింగ్ నాగ, ధనుష్ కి ఎలాంటి సక్సెస్ ఇస్తుంది అనేది వేచి చూడాలి. శేఖర్ కమ్ముల లవ్ స్టొరీ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండటం విశేషం.