Begin typing your search above and press return to search.

వైజ‌యంతి త‌న హ‌డావిడిపై ఇప్ప‌టికి క్లూ ఇచ్చింది

ద‌స‌రా సంద‌ర్భంగా దేవీ న‌వ‌రాత్రుల నేప‌థ్యంలోనే వైజ‌యంతీ సంస్థ ఇలా త‌మ సంస్థ నిర్మించిన సినిమాల్లోని హీరోయిన్ ల పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేస్తూ 9 ఎమోష‌న్స్ అంటూ ఇలా పోస్ట్‌లు పెట్ట‌డంతో వైజ‌యంతి హ‌డావిడి అంతా న‌వ‌రాత్రుల కోస‌మా! అని అంతా అవాక్క‌వుతున్నారు.

By:  Tupaki Desk   |   18 Oct 2023 6:21 AM GMT
వైజ‌యంతి త‌న హ‌డావిడిపై ఇప్ప‌టికి క్లూ ఇచ్చింది
X

టాలీవుడ్‌లో అలనాటి తార‌ల నుంచి నేటి త‌రం వ‌ర‌కు మూడు త‌రాల క‌థానాయ‌కుల‌తో సినిమాలు నిర్మించిన ఏకైక సంస్థ వైజ‌యంతీ మూవీస్‌. నంద‌మూరి తార‌క రామారావుతో మొద‌లైన ఈ సంస్థ త‌రాలు మారినా ఇప్ప‌టికీ టాలీవుడ్‌లో పేరున్న ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌గా ఓ వెలుగు వెలుగుతూ త‌న ప్రాభ‌వాన్ని చాటుకుంటూ వ‌స్తోంది. `ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం` సినిమాతో మ‌ళ్లీ స‌క్సెస్ ట్రాక్‌లోకి వ‌చ్చేసిన ఈ సంస్థ 'మ‌హాన‌టి'తో త‌న‌కు నిర్మాణ రంగంలో ఎవ‌రు సాటిలేర‌ని నిరూపించుకుంది.

ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌తో టైమ్ ట్రావెల్ మూవీ `క‌ల్కి 2898ఏడీ`ని నిర్మిస్తోంది. రూ.600 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీలో లెజెండ‌రీ యాక్ట‌ర్స్ అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ మూవీతో పాటు హీరో శ్రీ‌కాంత్ త‌న‌యుడు, యంగ్ హీరో రోష‌న్‌తో `ఛాంపియ‌న్‌` మూవీని నిర్మిస్తున్నారు. ఇవి రెండూ ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇటీవ‌ల వైజ‌యంతీ టీమ్ `జ‌గ‌దేకవీరుడు అతిలోక సుంద‌రి` నుంచి శ్రీ‌దేవి ఫొటోని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటూ `మా ఇంద్ర‌జ‌` అని పేర్కొంది.

శ్రీ‌దేవి పుట్టిన రోజు కాదు. సినిమా రిలీజ్ రోజు అంత‌క‌న్నా కాదు..ఆమె డెత్ డే కాదు. మ‌రి ఈ రోజు శ్రీ‌దేవి పోస్ట‌ర్‌ని ప్ర‌త్యేకంగా ఎందుకు రిలీజ్ చేసింద‌నే చ‌ర్చ మొద‌లైంది. చిరు, మ‌ల్లిడి వ‌శిష్ట‌ల క‌ల‌యిక‌లో రూపొందుతున్న సోషియో ఫాంట‌సీ మూవీని ఉద్దేశించే వైజ‌యంతీ సంస్థ ఇలా ప్ర‌క‌ట‌న చేసింద‌ని అంతా అనుకున్నారు. ఆ త‌రువాత ఈ నెల 16న `మా సీత‌` అంటూ `సీతా రామం` చిత్రంలోని మృణాల్ ఠాకూర్ ఫొటోని షేర్ చేసింది. దీంతో ఏం జ‌రుగుతోంది?..వైజ‌యంతి సంస్థ ఏం చెప్పాల‌నుకుంటోంది అన్న‌ది ఎవ‌రికీ అర్థం కాలేదు. ఈ పోస్ట‌ర్‌లో 9 ఎమోష‌న్స్ అంటూ ప్ర‌త్యేకంగా మెన్ష‌న్ చేయ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది.

ద‌స‌రా సంద‌ర్భంగా దేవీ న‌వ‌రాత్రుల నేప‌థ్యంలోనే వైజ‌యంతీ సంస్థ ఇలా త‌మ సంస్థ నిర్మించిన సినిమాల్లోని హీరోయిన్ ల పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేస్తూ 9 ఎమోష‌న్స్ అంటూ ఇలా పోస్ట్‌లు పెట్ట‌డంతో వైజ‌యంతి హ‌డావిడి అంతా న‌వ‌రాత్రుల కోస‌మా! అని అంతా అవాక్క‌వుతున్నారు. ముందే ఆ క్లారిటీ ఇచ్చేస్తే ఈ క‌న్ఫ్యూజ‌న్ ఉండేది కాదుగా అంటూ నెటిజ‌న్‌లు సెటైర్లు వేస్తున్నారు. ఇటీవ‌ల `ఆజాద్‌` సినిమాలో సౌంద‌ర్య పోషించిన అంజ‌లి పాత్ర‌ని గుర్తు చేస్తూ `మా అంజ‌లి` అంటూ ఆ సినిమాలోని సౌంద‌ర్య ఫొటోని షేర్ చేసింది. ఇదే త‌ర‌హాలో త‌మ సంస్థ నిర్మించిన సినిమాల్లో న‌టించిన కీర్తి సురేష్ (మ‌హాన‌టి), నిత్యామీన‌న్ (శ్రీ‌మ‌తి, కుమారి), మాళ‌విక నాయ‌ర్ (మ‌హాన‌టి)ల పోస్ట‌ర్ల‌ని కూడా రిలీజ్ చేయ‌బోతోంది.