Begin typing your search above and press return to search.

సప్తసాగరాలు సైడ్ బి.. ప్రేక్షకులు సైడ్ చేశారా?

రక్షిత్ శెట్టి హీరోగా కన్నడంలో తెరకెక్కిన సప్తసాగరాలు దాచే ఎల్లో మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది

By:  Tupaki Desk   |   19 Nov 2023 5:37 AM GMT
సప్తసాగరాలు సైడ్ బి.. ప్రేక్షకులు సైడ్ చేశారా?
X

రక్షిత్ శెట్టి హీరోగా కన్నడంలో తెరకెక్కిన సప్తసాగరాలు దాచే ఎల్లో మూవీ అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీనిని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. సప్తసాగరాలు దాటి సైడ్ ఏ పేరుతో ఈ మూవీని రిలీజ్ చేసి ఇక్కడా హిట్ కొట్టారు. దీంతో ఈ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కిన సప్తసాగరాలు దాటి సైడ్ బి ని రెండు భాషలలో ఒకే సారి రిలీజ్ చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసింది. అయితే మొదటి సినిమాకి వచ్చిన ఆదరణ సీక్వెల్ లో థియేటర్స్ లో రావడం లేదు. ఈ సినిమాకి పోటీగా అజయ్ భూపతి మంగళవారం రిలీజ్ అయ్యింది. అయితే అది కూడా చిన్న సినిమాగానే వచ్చింది. సప్తసాగరాలు దాటి సైడ్-ఏ మూవీ హిట్ కావడంతో కచ్చితంగా సీక్వెల్ కి సాలిడ్ ఓపెనింగ్స్ వస్తాయని ఎక్స్ పెక్ట్ చేశారు.

కాని ఎందుకనో అలా జరగలేదు. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భాగానే చేశారు. మంచి హైప్ ఇచ్చారు. కాని థియేటర్స్ కి ప్రేక్షకులని రప్పించడంలో మాత్రం విఫలం అయ్యారు. అలా అని ఈ సైడ్-బికి నెగిటివ్ రివ్యూలు రాలేదు. చూసినవాళ్ళు కూడా బాగానే ఉందని అంటున్నారు. కాని సైడ్-ఏతో పోల్చుకుంటే సైడ్-బి అంత ఎఫక్టివ్ గా అనిపించలేదని అంటున్నారు.

మొదటి సినిమా ఎమోషనల్ ఎలిమెంట్స్ తో హృదయాలని కదిలించే విధంగా ఉందని, అయితే సీక్వెల్ లో కూడా ఎమోషనల్ టచ్ ఉన్న, తరువాత రివేంజ్ డ్రామా మిక్స్ చేయడంతో కొంత వరకు ట్రాక్ తప్పిందనే మాట వినిపిస్తోంది. అందుకే ఊహించిన స్థాయిలో పబ్లిక్ నుంచి రెస్పాన్స్ రావడం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.

అయితే ఈ మూవీ ఒటీటీలో మాత్రం కచ్చితంగా ప్రేక్షకులకి రీచ్ అయ్యే అవకాశం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరి సప్తసాగరాలు దాటి సైడ్-బి మూవీ తెలుగులో ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది అనేది పూర్తిగా తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూదాల్సిందే.