Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్- బ‌న్ని మ‌ధ్య‌లోకి స‌ల్మాన్ దూరాడు!

నిజానికి సందీప్ వంగ త‌దుప‌రి అల్లు అర్జున్, ప్రభాస్‌లతో సినిమాలు చేయాల్సి ఉంది

By:  Tupaki Desk   |   3 Feb 2024 4:21 AM GMT
ప్ర‌భాస్- బ‌న్ని మ‌ధ్య‌లోకి స‌ల్మాన్ దూరాడు!
X

అర్జున్ రెడ్డి , కబీర్ సింగ్ చిత్రాల‌తో సంచ‌ల‌నాలు సృష్టించిన‌ సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ తాజా చిత్రం యానిమల్‌తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. త‌దుప‌రి ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా స్పిరిట్ అనే పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. తాజాగా ఫిల్మ్‌ఫేర్ లోని ఓ క‌థ‌నం ప్రకారం.. ఒక డార్క్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ కోసం సల్మాన్ ఖాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

నిజానికి సందీప్ వంగ త‌దుప‌రి అల్లు అర్జున్, ప్రభాస్‌లతో సినిమాలు చేయాల్సి ఉంది. చిరంజీవి, షారుఖ్‌ఖాన్‌ వంటి పెద్ద స్టార్‌లతో కలిసి పనిచేయాలనే కోరికను వ్య‌క్తం చేసాడు. మ‌హేష్ తో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ పైనా ఆలోచిస్తున్నాడ‌ని స‌మాచారం.

కానీ ఇంత‌లోనే స‌ల్మాన్ భాయ్ తో డార్క్ థ్రిల్ల‌ర్ తీయాల‌నుకోవ‌డం ఆశ్చర్య‌ప‌రుస్తోంది. ప్ర‌భాస్- బ‌న్ని మ‌ధ్య‌లోకి స‌ల్మాన్ దూరాడు! అని కూడా అర్థ‌మ‌వుతోంది. అయితే సందీప్ లైన‌ప్ లో ఎవ‌రితో ముందుగా సినిమా ప్రారంభ‌మ‌వుతుంది? అన్న‌ది ఆస‌క్తిగా మారింది. సందీప్ వంగా కోసం టాలీవుడ్ అగ్ర‌హీరోలంతా ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. చిరంజీవి-చ‌ర‌ణ్ కూడా అత‌డితో ప‌ని చేయాల‌ని ఎంతో ఆస‌క్తిగా ఉన్నార‌ని గుస‌గుస‌లు వినిపించాయి. అయితే ఎవరికి ముందుగా అవ‌కాశం ద‌క్కుతుంది? అన్న‌ది స‌స్పెన్స్ గా మారింది.

తదుపరి సల్మాన్ ఖాన్ ఓ భారీ చిత్రం కోసం స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. కరణ్ జోహార్‌తో కలిసి విష్ణువర్ధన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రం చేయనున్నాడు. ఈ చిత్రం నిజ కథ నుండి ప్రేరణ పొంది రూపొందిస్తున్న‌ది. సల్మాన్ ఖాన్ పారామిలటరీ అధికారి పాత్రలో కనిపిస్తాడు. 2024లో క్రిస్మస్ వారాంతంలో పెద్ద స్క్రీన్‌పై విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో నవంబర్ 2023లో చిత్రీకరణ ప్రారంభించాలని ప్రాథమిక ప్రణాళిక ఉంది. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించి అధికారిక ధృవీకరణ లేదు.