Begin typing your search above and press return to search.

హీరో కి రూ.70 కోట్లు, దర్శకుడికి రూ.200 కోట్లు!

అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రెడ్డి వంగ అందరి దృష్టిని ఆకర్షించాడు

By:  Tupaki Desk   |   26 Dec 2023 3:30 PM GMT
హీరో కి రూ.70 కోట్లు, దర్శకుడికి రూ.200 కోట్లు!
X

అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన సందీప్ రెడ్డి వంగ అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమా ను ఇలా కూడా తీస్తారా... ఇలా తీసినా కూడా సినిమాను జనాలు చూస్తారా అంటూ ఫిల్మ్‌ మేకర్స్ ముక్కున వేలు వేసుకుని ఆశ్చర్యపోయే విధంగా అర్జున్‌ రెడ్డిని రూపొందించి అందరికి షాక్ ఇచ్చాడు.

అదే అర్జున్‌ రెడ్డిని బాలీవుడ్‌ లో కబీర్‌ సింగ్ గా రీమేక్ చేయడం ద్వారా అక్కడ కూడా మంచి ఫాలోయింగ్‌ ను సొంతం చేసుకుని, బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్ దృష్టిలో పడ్డాడు. దాంతో టీ సిరీస్ తో కలిసి రణబీర్‌ కపూర్ తో యానిమల్‌ సినిమాను చేసే అవకాశం ను దక్కించుకున్నాడు.

యానిమల్‌ సినిమాకు సందీప్ వంగ దర్శకుడు మాత్రమే కాకుండా నిర్మాణ భాగస్వామిగా కొనసాగాడు. తనకు దర్శకుడిగా రావాల్సిన పారితోషికం ను తీసుకోకుండా నిర్మాణం లో ఉపయోగించడం జరిగింది. అంతే కాకుండా కబీర్‌ సింగ్ ద్వారా వచ్చిన లాభాలను కూడా యానిమల్‌ లో పెట్టిన సందీప్ వంగ భారీ లాభాలను దక్కించుకున్నాడు.

బాలీవుడ్‌ బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం యానిమల్‌ సినిమా లాంగ్‌ రన్‌ పూర్తి అయ్యే వరకు దాదాపుగా రూ.900 కోట్లు వసూళ్లు చేసే అవకాశాలు ఉన్నాయి . అదే నిజం అయితే నిర్మాతగా దర్శకుడు సందీప్ వంగ అందుకోబోతున్న మొత్తం దాదాపుగా రూ.200 కోట్లుగా సమాచారం అందుతోంది.

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం లో మరియు దేశం వెలుపల అన్ని చోట్ల కూడా యానిమల్‌ సినిమాకు భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. ఈ మొత్తం వసూళ్లలో సందీప్‌ వంగ వాటాగా రూ.200 కోట్ల రూపాయలు దక్కాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

సందీప్ వంగ యానిమల్‌ సినిమా తర్వాత చేయబోతున్న చిత్రం 'స్పిరిట్‌'. ప్రభాస్ తో సందీప్ చేయబోతున్న స్పిరిట్ కు కూడా టీ సిరీస్‌ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతుంది. అంతే కాకుండా సందీప్ వంగ కూడా నిర్మాణ భాగస్వామిగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి సందీప్ వంగ ఇండియాలో అత్యధిక లాభాలు దక్కించుకున్న దర్శకుడిగా నిలిచాడు అంటూ హిందీ మీడియా సంస్థ ఒకటి తన కథనంలో పేర్కొనడం జరిగింది.