Begin typing your search above and press return to search.

సందీప్ రెడ్డి 3 సినిమాలు.. లెక్క తేలింది!

యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ అనే మూవీ చేయబోతున్న విషయం తెలిసింది కదా

By:  Tupaki Desk   |   19 Dec 2023 2:55 PM GMT
సందీప్ రెడ్డి 3 సినిమాలు.. లెక్క తేలింది!
X

బాలీవుడ్ స్టార్ రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన 'యానిమల్' మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ వద్ద రూ.850 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకొని రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. విడుదలై మూడు వారాలు కావస్తున్నా ఇంకా థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ లో దూసుకుపోతోంది.

ముఖ్యంగా నార్త్ లో అయితే ఇప్పటికీ భారీ వసూళ్లు అందుకుంటుంది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ బాండింగ్ నేపథ్యంలో రివెంజ్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా రణ్ బీర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమాతో పాటు దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో సందీప్ తదుపరి ప్రాజెక్టుల గురించి ఆడియన్స్ లోనూ మరింత ఆసక్తి నెలకొంది.

యానిమల్ తర్వాత సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ అనే మూవీ చేయబోతున్న విషయం తెలిసింది కదా. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోతో సందీప్ రెడ్డి సినిమా చేస్తుండడంతో ముందు నుంచే ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే యానిమల్ భారీ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ 'యానిమల్ పార్క్' ని సందీప్ మొదట సెట్స్ పైకి తీసుకెళ్తారని, ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాతే 'స్పిరిట్' ఉంటుందని రీసెంట్ గా కొన్ని వార్తలు తెరపైకి వచ్చాయి.

అటు ప్రభాస్ కూడా కమిట్ అయిన సినిమాల షూటింగ్స్ ని పూర్తి చేయాలంటే టైం పడుతుంది. కాబట్టి స్పిరిట్ మూవీ లేట్ అవుతుందేమోనని, దానికంటే ముందు యానిమల్ పార్క్ ఉంటుందని టాక్ వినిపించగా, అందులో నిజం లేదని బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ వివరణతో క్లారిటీ వచ్చేసింది. యానిమల్ మూవీని నిర్మించిన టీ సిరీస్ భూషణ్ కుమార్ సందీప్ రెడ్డి వంగాతో మరో మూడు ప్రాజెక్ట్స్ ని నిర్మించనున్నారు.

ఇదే విషయాన్ని నిర్మాత భూషణ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్, యానిమల్ పార్క్, అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ ని నిర్మిస్తున్నట్లు చెప్పిన ఆయన వీటిలో 'స్పిరిట్' మూవీ ముందుగా సెట్స్ పైకి వెళ్లనుందని క్లారిటీ ఇచ్చాడు. కాగా 2025లో 'స్పిరిట్' మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.