వాళ్ల రేంజ్ మారిపోయింది మాష్టారు!
300..500..600 కోట్లు ఇలా ఎంతైనా స్క్రిప్ట్ ని బట్టి బడ్జెట్ పెరుగుతుంటుంది. ఇక రీజనల్ సినిమాల విష యంలో టైర్ 2 హీరోలతో సినిమాలంటే మినిమం 100 కోట్లు ఖర్చు అవుతుంది.
By: Tupaki Desk | 2 April 2025 9:00 AM ISTసౌత్ లో భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణం అంటే టాలీవుడ్ పరిశ్రమ పేరే వినిపిస్తుంది. వందల కోట్లు పెట్టు బడులు తెలుగు పరిశ్రమ నుంచే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా అంటే 250 కోట్లు అన్నది మినిమం బడ్జెట్. ఏ నిర్మాత అయినా స్టార్ హీరోతో పాన్ ఇండియా సినిమా తీయాలని ఉన్నా? 250 కోట్లకు పైగా పట్టుకుని వస్తేనే పనవుతుంది. ఆ ఫిగర్ నుంచి బడ్జెట్ ఎంతైనా పెరిగే అవకాశం ఉంటుంది.
300..500..600 కోట్లు ఇలా ఎంతైనా స్క్రిప్ట్ ని బట్టి బడ్జెట్ పెరుగుతుంటుంది. ఇక రీజనల్ సినిమాల విష యంలో టైర్ 2 హీరోలతో సినిమాలంటే మినిమం 100 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంకా తగ్గించాలంటే 50-80 కోట్లు అన్నది మినిమంగా మారిపోయింది. అందుకే టాలీవుడ్ లో సినిమా నిర్మాణ వ్యయం భరించలేక కొత్త నిర్మాతలు తగ్గిపోతున్నారు? అన్నది అంతే వాస్తవం. ఆ తర్వాత అంతగా నిర్మాణ వ్యయం పెరిగిన ఇండస్ట్రీ ఏది అంటే? కోలీవుడ్ పరిశ్రమ పేరు వినిపిస్తుంది. కానీ వాళ్లను మించిన ఖర్చు ఇప్పుడు శాండిల్ వుడ్ పెడుతుంది.
సినిమా బడ్జెట్ విషయంలో శాండిల్ వుడ్ ఎక్కడా రాజీ పడటం లేదు. `కేజీఎఫ్` ఇచ్చిన ధైర్యంతో వందల కోట్లు పెట్టుబడి పెట్టడానికి అక్కడ నిర్మాణ సంస్థలు మందుకొస్తున్నాయి. ప్రస్తుతం `కాంతార2` చిత్రానికి హోంబలే ఫిల్మ్స్ ఏకంగా 200 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. రిషబ్ శెట్టికి కావాల్సిన వన్నీ క్షణాల్లో ఏర్పాటు చేస్తుంది.
అలాగే యశ్ హీరోగా గీతూమోహన్ దాస్ తెరకెక్కిస్తోన్న `టాక్సిక్` చిత్రం కోసం కేవీఎన్- మాన్ స్టార్ మైండ్ క్రియేషన్స్ 300 కోట్లు బడ్జెట్ పెడుతుంది. వీటన్నింటి కంటే ముందు ఉపేంద్ర నటించిన `కబ్జా` చిత్రం 120 కోట్లతో నిర్మాణమైంది. ఒకప్పుడు శాండిల్ వుడ్ నుంచి 20 కోట్ల బడ్జెట్ సినిమా రిలీజ్ అవ్వడం కష్టంగా కనిపించేది. అలాంటిదిప్పుడు ఏకంగా వందల కోట్ల బడ్జెట్ తో నిర్మాణానికి ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. దీంతో పాన్ ఇండియా మార్కెట్ లో శాండిల్ వుడ్ పేరు బడ్జెట్ పరంగా మారు మ్రోగుతుంది.