Begin typing your search above and press return to search.

25 కోట్ల అప్పు.. సామ్ క్లారిటీ కౌంటర్

ఈ క్రమంలోనే ఆమె తన చికిత్స కోసం ఓ స్టార్ హీరో దగ్గర రూ.25కోట్లు అప్పు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగింది.

By:  Tupaki Desk   |   5 Aug 2023 6:35 AM GMT
25 కోట్ల అప్పు.. సామ్ క్లారిటీ కౌంటర్
X

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత.. సినిమాల కు కాస్త బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా తన మేకప్ ఆర్టిస్ట్, స్నేహితురాలు అనూషతో కలిసి చిల్ కొడుతోంది. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా గడుపుతోంది.

అయితే కొంతకాలంగా మయోసైటిస్‌ తో బాధపడుతున్న ఆమె ఆ మధ్యలో ఓ సారి సినిమాల కు బ్రేక్ ఇచ్చి చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఆ చికిత్స కోసమే బ్రేక్ తీసుకుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె తన చికిత్స కోసం ఓ స్టార్ హీరో దగ్గర రూ.25కోట్లు అప్పు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. ఆ తర్వాత అది తప్పుడు వార్త అని కూడా అన్నారు.

తాజాగా ఈ విషయం పై సమంత క్లారిటీ ఇచ్చింది. తన ఇన్ స్టా స్టోరీస్ లో ఆ విషయం గురించి మాట్లాడుతూ ఓ పోస్ట్ రాసుకొచ్చింది. "మయోసైటిస్ చికిత్సకు 25 కోట్లా? ఎవరో మీకు తప్పుడు సమాచారన్ని ఇచ్చారు. మీతో తప్పుడు డీల్ ను కుదుర్చుకున్నారు. నేను అందులో అతి తక్కువ మాత్రమే ఖర్చు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. నన్ను నేను జాగ్రత్తగా చూసుకోగలను. మయోసైటిస్ అనేది వేలాది మంది ఎదుర్కొంటున్న సమస్య అది. ధన్యవాదాలు " అని సమంత చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన అభిమానులు దాన్ని మరింత షేర్ చేస్తూ సమంత ఎప్పుడు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇకపోతే సమంత రీసెంట్ గా విజయ్ దేవరకొండతో కలిసి 'ఖుషి' సినిమా షూటింగ్ ను పూర్తి చేసింది. లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబరు 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా లోని పాటలు బాగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యాయి.

అలానే ఈ చిత్రం తో పాటు సమంత 'సిటాడెల్' ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ లోనూ నటించింది. దర్శకద్వయం రాజ్ అండ్ డీకే దీన్ని తెరకెక్కించారు. ఇది నెట్ ఫ్లిక్స్ వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఇందులో సామ్ పోరాట సన్నివేశాల్లో నటించింది.