Begin typing your search above and press return to search.

చైతు హీరోయిన్ పై సామ్ స్టన్నింగ్ రియాక్షన్

ఆ సమయంలో సాయి పల్లవి డ్యాన్స్ చూసి.. ఫిదా అయింది సామ్. అద్భుతంగా డ్యాన్స్ చేశావంటూ చెప్పుకొచ్చింది.

By:  Tupaki Desk   |   22 Feb 2024 3:30 PM GMT
చైతు హీరోయిన్ పై సామ్ స్టన్నింగ్ రియాక్షన్
X

సాయి పల్లవి.. ఈ లేడీ సూపర్ స్టార్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. డ్యాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి హీరోయిన్ గా మారింది ఈ నేచురల్ బ్యూటీ. తన డ్యాన్స్, అందం, అభినయంతో అందరి మనసులను దోచుకుంది. దక్షిణాదిలో కోట్లాది మంది సినీ ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. గ్లామరస్‌ రోల్‌ అయినా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్‌ పాత్రలోనైనా ఈజీగా లీనమైపోతోంది.

ఇటీవల సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. తన చెల్లి నిశ్చితార్థ వేడుకలో వేసిన సాయి పల్లవి డ్యాన్స్ కు అంతా ఫిదా అయిపోయారు. ఆ వీడియో ఇప్పటికీ కూడా ట్రెండింగ్ లో ఉంది. సాయి పల్లవి తీన్మార్ స్టెప్పులకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు మస్తు ఖుషీ అయ్యారు. తాజాగా సాయి పల్లవి డ్యాన్స్ కు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫిదా అయింది!

లేడీ సూపర్ స్టార్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చూసి షాక్ అయింది సామ్. మాటలు రావడం లేదని, అలా డ్యాన్స్ చూస్తూ ఉండిపోయానని చెప్పింది. ఇదంతా ఎప్పుడు అయిందీ అనుకుంటున్నారా? ఈ సన్నివేశం ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల క్రితం జరిగిన ఈ మూమెంట్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు సామ్, సాయిపల్లవిని గుర్తుపట్టలేక పోతున్నట్లు కామెంట్లు పెడుతున్నారు.

హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో సమంత.. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీకి చీఫ్ గెస్ట్ కు వెళ్లింది. ఆ సీజన్ లో సాయిపల్లవి కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసింది. ఆ సమయంలో సాయి పల్లవి డ్యాన్స్ చూసి.. ఫిదా అయింది సామ్. అద్భుతంగా డ్యాన్స్ చేశావంటూ చెప్పుకొచ్చింది. ఆమెకు సాయి పల్లవి థ్యాంక్స్ కూడా చెప్పింది. ఆ వీడియోనే ఇప్పుడే మళ్లీ ట్రెండ్ అవుతోంది.

ఇక సాయి పల్లవి ప్రస్తుతం యువ సామ్రాట్ నాగ చైతన్యతో జతకట్టింది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న తండేల్ మూవీలో నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి.. అచ్చ పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుంది. ఈ చిత్రం కోసం ఉత్తరాంధ్ర యాస కూడా నేర్చుకుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ మూవీ.. దసరా పండుగకు థియేటర్లలోకి రానుంది.