Begin typing your search above and press return to search.

సమంత ఆ పని చేస్తుందా..? ఫ్యాన్స్ వెయింటింగ్..!

ఈ ట్రైలర్ లాంఛ్ కి సమంత వస్తే, ఫ్యాన్స్ సంబరపడటం ఖాయం. మూవీకి కూడా మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది.

By:  Tupaki Desk   |   9 Aug 2023 5:24 AM GMT
సమంత ఆ పని చేస్తుందా..? ఫ్యాన్స్ వెయింటింగ్..!
X

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు దక్షిణాదిన స్టార్ హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె నటించిన సినిమాలు చూడటానికి ఫ్యాన్స్ కూడా చాలా ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటీవల సామ్ తన ఆరోగ్యం దృష్టి సినిమాలకు సంవత్సరం బ్రేక్ ఇస్తానంటూ ప్రకటించడంతో, చాలా మంది ఫ్యాన్స్ బాధపడ్డారు. అంతకాలం సమంతను చూడలేమా అని నిరుత్సాహానికి గురయ్యారు. కానీ, ఆమె నటించిన ఖుషీ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది అని తెలిసి హ్యాపీ గా ఫీలయ్యారు.

అయితే, ఇప్పుడు ఆ ప్రమోషన్ టైమ్ మొదలైంది. ఇంతకీ మ్యాటరేంటంటే, విజయ్ దేవరకొండ, సమంత జంటగా ఖుషీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. చాలా కాలం తర్వాత వీరిద్దరూ మంచి కంప్లీట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు.

ఈ సినిమా వచ్చే నెల అంటే సెప్టెంబర్ 1వ తేదీన ఈ ప్రేమ కథ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ రోజు ఆగస్టు9 న రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

ఈ ట్రైలర్ లాంఛింగ్ కార్యక్రమాన్ని స్పెషల్ గా నిర్వహించాలని అనుకుంటారు. ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే ట్రైలర్ లాంచ్ కి స్పెషల్ గా ఓ ఈవెంట్ పెడుతున్నారు. మరి, విజయ్, సమంత సినిమా అంటే ఈవెంట్ ఏర్పాటు చేయకుండా ఎలా ఉంటారు..? అయితే ఇప్పుడు అందరి కళ్లు,ఈ ఈవెంట్ కి సమంత వస్తుందా లేదా అనే దానిపైనే ఉండటం విశేషం. ఈ ట్రైలర్ లాంఛ్ కి సమంత వస్తే, ఫ్యాన్స్ సంబరపడటం ఖాయం. మూవీకి కూడా మంచి మైలేజ్ వచ్చే అవకాశం ఉంది.

అయితే, ఎప్పటినుంచో, సమంత ఖుషీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది అనే ప్రచారం అయితే ఉంది. ఇప్పటి వరకు ఆమె అమెరికా వెళ్లకుండా ఉండటానికి కారణం కూడా అదేనని ప్రచారం జరుగుతోంది. మరి, సమంత వస్తుందో లేదో తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఇదిలా ఉండగా, సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతోంది. దానికి చికిత్స తీసుకోవడానికి అమెరికా వెళ్లాల్సి ఉంది.

అయితే, సమంత చికిత్స ఖర్చు మొత్తం ఓ స్టార్ హీరో భరిస్తున్నాడు అంటూ ఇటీవల వార్తలు రాగా, వాటిని ఆమె ఖండించారు. తన చికిత్స ఖర్చులు తాను భరించగలనని, తాను సంపాదించుకున్నానంటూ క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ ఆమె ట్రైలర్ లాంఛ్ కి వస్తే,మళ్లీ ఇలాంటి ప్రశ్నలు మీడియా వారు ప్రస్తావించే అవకాశం లేకపోలేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో.